Car Accident: ఆంధ్రప్రదేశ్ లో పెను ప్రమాదం తప్పింది. టీడీపీకి చెందిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కారుకు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుగు ప్రయాణంలో ఆయన పెడన వెళ్తుండగా.. గంగూరు వద్ద ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఉయ్యూరు డిపోకి చెందిన ఈ బస్సు ఢీకొనడంతో ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది. ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే ఎమ్మెల్యే మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం ఎమ్మెల్యే తన నివాసానికి వెళ్లిపోయారు.
Also Read: Airtel నుంచి మరో దుమ్మురేపే ప్లాన్.. ఇలాంటి బెనిఫిట్స్ కదా.. యూజర్లకు కావాల్సింది!