Nara Lokesh: ఒంగోలు కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ప్రసంగంలో వైఏస్ఆర్సీపీ పార్టీ అదినేత జగన్ పై నిప్పులు చెరిగారు. మేం చేసిన పనులను క్రెడిట్ చోరీ చేసే వ్యక్తి జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ పనులు చేయకుండానే అప్పట్లో ప్రారంభించారని అన్నారు.
డీఎస్సీపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తా అందుకు జగన్ సిద్ధమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా డీఎస్సీ వేస్తామని మంత్రి నారాలోకేష్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ హయాంలో చేసిన తప్పులకు కొందరు జైళ్లకు వెళ్తున్నారు. వైసీపీ హయాంలో బీసీలను అనేక ఇబ్బందులు పెట్టారని అన్నారు.
Also read: ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. కొత్త స్కీమ్కు జీవో జారీ!
మా పార్టీ నేతలు, కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారు. మా వద్దకు వస్తే దొంగ కేసులు ఎత్తేసేలా చూస్తాం అని అన్నారు. ఒంగోలులో పోతురాజు కాలువ బాగుచేసే బాధ్యత తీసుకుంటామని, దామచర్ల జనార్దన్ వచ్చాక ఒంగోలు రూపురేఖలు మారాయని మంత్రి నారాలోకేష్ తెలిపారు. ఒంగోలులో నీటి కొరత ఉంది. అమృత్ పథకం ద్వారా సమస్య పరిష్కరిస్తామని నారాలోకేష్ ప్రజలకు క్లారిటీ ఇచ్చారు.
Also read: స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు.. సీఎం చంద్రబాబు ఫైర్!