BigTV English
Advertisement

Anna canteens reopen: ఏపీలో అన్నా క్యాంటీన్లు మళ్లీ ఓపెన్, ఈసారి..!

Anna canteens reopen: ఏపీలో అన్నా క్యాంటీన్లు మళ్లీ ఓపెన్, ఈసారి..!

Anna canteens reopen: ఆంధప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఆగష్టు 15న వీటిని అందుబాటులోకి తీసుకు రావాలని ఆలోచన చేస్తోంది. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


అన్న క్యాంటీన్లు గురించి చెప్పనక్కర్లేదు. పల్లెటూరు నుంచి పట్టణం, నగరాలకు వచ్చే ప్రజలకు తక్కువ డబ్బులతో కడుపు నింపే పథకం. గతంలో చంద్రబాబు సర్కార్ దీన్ని తీసుకొచ్చింది. బాగానే సక్సెస్ అయ్యింది. కంటిన్యూ అవుతుందని భావించారు. ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో జగన్ సర్కార్ వీటిని పక్కనపెట్టేసింది.

అన్నక్యాంటీన్లు పునఃప్రారంభించాలని ఆలోచన చేస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించాలని భావిస్తోంది. గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ, స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది.


టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. 183 క్యాంటీన్ల మరమత్తుల కోసం దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు ఓ అంచనా. ఈ నెలాఖరులోగా ఆహారం సరఫరా చేసే టెండర్లను ఖరారు చేయనున్నారు. అన్నక్యాంటీన్ల పేరుతో ఓ ట్రస్ట్ ప్రారంభించనున్నట్లు సమాచారం. దీని కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ రెడీ చేస్తున్నారు.

ALSO READ: ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రాజీనామా !

క్యాంటీన్ల నిర్వహణ కోసం దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే కుప్పం టూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎప్పటిమాదిరిగా పనుల కోసం పట్టణం, నగరాలకు వచ్చే ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆహారం లభించనుందన్నమాట.

Tags

Related News

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Big Stories

×