BigTV English

Tirumala news: చిక్కిన మరో చిరుత.. ఇక నడకమార్గం సేఫేనా..?

Tirumala news: చిక్కిన మరో చిరుత.. ఇక నడకమార్గం సేఫేనా..?
Another Chirutha caught in Tirumala

Another Chirutha caught in Tirumala(AP news live):

తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి నడకదారిలో లక్ష్మీనరసింహాస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో వచ్చి చిక్కింది. ఆపరేషన్‌ చిరుత చేపట్టిన టీటీడీ అధికారులు గతంలోనే 5 చిరుతలను బంధించారు. తాజాగా మరో చిరుత చిక్కడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.


తిరుమలకు నడిచి వెళ్లే భక్తులను కొంతకాలంగా చిరుతలు హడలెత్తిస్తున్నాయి. కౌశిక్‌ అనే బాలుడిపై చిరుత దాడి చేసింది. చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందింది. ఈ ఘటనల తర్వాత అప్రమత్తమైన టీటీడీ, ఫారెస్ట్‌ అధికారులు చిరుతలను బంధించేందుకు ఆపరేషన్‌ చిరుత చేపట్టారు.

జూన్‌ 23న అలిపిరి నడకమార్గంలో 7వ మైలుకు సమీపంలో ఓ చిరుతను బంధించారు. ఆ తర్వాత ఆగస్టు 14న మరో చిరుత వచ్చి చిక్కింది. అదే నెల 17న మూడో చిరుత 28న 4వ చిరుతను బంధించారు. ఒకే నెలలో మొత్తం 3 చిరుతలు చిక్కేసరికి భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.


ఇక సెప్టెంబర్‌ 7న కూడా అధికారులు ఏర్పాటు చేసిన బోనుకి మరో చిరుత చిక్కింది. ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత సంచారాలను గుర్తించి 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం మధ్యలోని అటవీ ప్రాంతంలో 9 బోనులను అధికారులు ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కడంతో ఇప్పటి వరకూ చిక్కిన చిరుతల సంఖ్య 6కు చేరింది.

అయితే లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. బంధించిన చిరుతల్లో రెండు చిరుతలు లక్షితపై దాడి చేసినవి ఇప్పటికే నిర్ధారించారు. వాటిని అటవీ ప్రాంతంలో వదిలివేశారు. మరో రెండు చిరుతల రిపోర్ట్‌ కోసం వేచిచూస్తున్నారు ఫారెస్ట్‌ అధికారులు. తాజాగా చిక్కిన మరో చిరుత నమూనాను కూడా ల్యాబ్‌కు పంపుతారు.

Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×