E-Paper
Advertisement

Rain Alert: వచ్చే 12 గంటలు జోరు వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాల్లో తస్మాత్ జాగ్రత్త!

Rain Alert: వచ్చే 12 గంటలు జోరు వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాల్లో తస్మాత్ జాగ్రత్త!
Advertisement

Rain Alert: ఏపీలో జోరు వర్షాల జాడ కనిపిస్తోంది. రానున్న 12 గంటల్లో ఏపీలో మరింతగా జోరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతుండగా, రానున్న 24 గంటలు ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమ పరిధిలో గల పలు జిల్లాలలో ఉదయం నుండి మోస్తారు వర్షం కురుస్తోంది. అయితే అల్పపీడనం కారణంగా వచ్చే 12 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే 24 గంటల్లో కాకినాడ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది.

Advertisement

అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 12 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన జారీ చేసింది. ప్రధానంగా రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మోటార్ల వద్దకు వెళ్లకుండా ఉండడమే సురక్షితమని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

Also Read: AP Helmet New Rule: బైక్ పై రయ్.. రయ్ అంటూ వెళుతున్నారా.. ఇప్పటి నుండి ఇక అలా కుదరదు!

Advertisement

ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్స్ ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, వరద నీరు చేరేలా ఉంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పుడిప్పుడే ఏపీకి వర్షం వదిలేలా లేదని చెప్పవచ్చు. ఓ వైపు చలిగాలులు మరోవైపు వర్షపు జల్లులు కురుస్తుండగా, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×