E-Paper
Advertisement

AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో RRR హవా.. నాటు నాటు పాట పాడిన చంద్రబాబు.. అసలు కారణం ఇదే!

AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో RRR హవా.. నాటు నాటు పాట పాడిన చంద్రబాబు.. అసలు కారణం ఇదే!
Advertisement

Naatu Naatu Song – AP Assembly Session: అసెంబ్లీ సమావేశాల్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR సినిమా పేరు మార్మోగింది. అలాగే ఆ సినిమాలోని నాటు నాటు.. పాట కూడా అదే స్థాయిలో అసెంబ్లీ లో వినిపించింది. ఇంతకు అసెంబ్లీ లో ఈ సినిమా గోల ఏమిటని అనుకుంటున్నారా.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మేల్యే రఘురామకృష్ణంరాజు ఎన్నికైన నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా చిరునవ్వులు చిందించారు సభ్యులు. ఇంతకు ఈ ఆసక్తికర కామెంట్స్ చేసింది ఎవరో కాదు సాక్షాత్తు సీఎం చంద్రబాబు.

నువ్వు చంపాలని చూశావు.. నేను హోదా కల్పించి గౌరవించా.. ఇది నీకు నాకు ఉన్న తేడా.. త్రిబుల్ ఆర్ సినిమా గుర్తుందిగా.. అందులో నాటు నాటు.. సాంగ్ వినే ఉంటావుగా.. అంత సంచలనం సృష్టించారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అంటూ మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు అన్నారు.

Advertisement

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఎన్నిక కాగా, అసెంబ్లీలో త్రిబుల్ ఆర్ సినిమా పేరు మార్మోగింది. దీనికి కారణం రఘురామకృష్ణంరాజు కూడా త్రిబుల్ ఆర్ గా గుర్తింపు పొందారు. అందుకే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సినిమా రంగంలో RRR సినిమా ఎంత సంచలనం సృష్టించిందో తెలుసుగా.. అదే స్థాయిలో రాజకీయాల్లో కూడా మా త్రిబుల్ ఆర్ సంచలనం సృష్టించారన్నారు. అంతటితో ఆగక నాటు నాటు పాట కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు, ఆ స్థాయిలో వాణి వినిపించారంటూ రఘురామకృష్ణంరాజును కొనియాడారు.

Advertisement

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గురించి సీఎం కొనియాడుతున్నంత సేపు సభ్యుల నవ్వులే నవ్వులు సాగాయి. వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో ధిక్కార స్వరం వినిపించి రోజూ రచ్చబండ పేరిట, మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా రఘురామ తన వాణి వినిపించేవారు. యూట్యూబ్ లో త్రిబుల్ ఆర్ విమర్శలకు వచ్చే వ్యూస్ ప్రభంజనం అని చెప్పవచ్చు.

Also Read: Sharmila on Sri Reddy: శ్రీరెడ్డి.. నీ సారి? పోలీసులూ వదలొద్దు.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైఎస్ షర్మిళ

ప్రతిరోజూ ఒంటి గంట నుండి 2 గంటల వరకు ఈ విమర్శల ప్రసంగం.. గోదావరి యాసలో సాగగా, స్పెషల్ ఫాలోయింగ్ కూడా రఘురామకృష్ణంరాజుకు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే కాబోలు ఆ విమర్శలను దృష్టిలో ఉంచుకొని, సీఎం చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారని ఎమ్మేల్యేలు అభిప్రాయపడ్డారు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×