BigTV English
Advertisement

Purandeswari: రైతులకు రూ.50 వేలు ఇవ్వాలి.. పురందేశ్వరి డిమాండ్

Purandeswari: రైతులకు రూ.50 వేలు ఇవ్వాలి.. పురందేశ్వరి డిమాండ్

Purandeswari: మిగ్ జామ్ తుపాను రైతాంగాన్ని కుదేలు చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. చేతికొచ్చే సమయానికి నీటి పాలైంది. ఊహించని తుపాను.. రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. కోతలు కోసి ఉంచిన పంటలతో పాటు.. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు సైతం నీటమునిగాయి. వాటిని కోసి.. ఎండబెట్టేకన్నా.. ట్రాక్టర్లతో తొక్కించడమే మేలని వాపోతున్నారు. కోస్తాంధ్ర తీరంవెంబడి వీచిన ఈదురుగాలులు, భారీ వర్షాలకు వరిపంటలన్నీ పడిపోయాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్లలో పర్యటించారు.


వర్షానికి తడిన ధాన్య రాశులను పరిశీలించి.. రైతులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఇప్పటివరకూ ఏపీ మంత్రులెవరూ పరామర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా తయారయ్యాయని, తడిసిన ధాన్యాన్ని కొంటామని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని, రైతులకు సకాలంలో గోనె సంచులు అందడం లేదన్నారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని, రంగు మారిన, తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.


Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×