E-Paper
Advertisement

Purandeswari: రైతులకు రూ.50 వేలు ఇవ్వాలి.. పురందేశ్వరి డిమాండ్

Purandeswari: రైతులకు రూ.50 వేలు ఇవ్వాలి.. పురందేశ్వరి డిమాండ్
Advertisement

Purandeswari: మిగ్ జామ్ తుపాను రైతాంగాన్ని కుదేలు చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. చేతికొచ్చే సమయానికి నీటి పాలైంది. ఊహించని తుపాను.. రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. కోతలు కోసి ఉంచిన పంటలతో పాటు.. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు సైతం నీటమునిగాయి. వాటిని కోసి.. ఎండబెట్టేకన్నా.. ట్రాక్టర్లతో తొక్కించడమే మేలని వాపోతున్నారు. కోస్తాంధ్ర తీరంవెంబడి వీచిన ఈదురుగాలులు, భారీ వర్షాలకు వరిపంటలన్నీ పడిపోయాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్లలో పర్యటించారు.

వర్షానికి తడిన ధాన్య రాశులను పరిశీలించి.. రైతులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఇప్పటివరకూ ఏపీ మంత్రులెవరూ పరామర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా తయారయ్యాయని, తడిసిన ధాన్యాన్ని కొంటామని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని, రైతులకు సకాలంలో గోనె సంచులు అందడం లేదన్నారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని, రంగు మారిన, తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×