AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలతో ముగిసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.
ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
యువత ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ద్వారా అధికారిక ఆమోదం ముద్ర వేయించింది. త్వరలోనే వీటికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది.
భోగాపురం ఎయిర్పోర్ట్
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, రాబోయే గోదావరి పుష్కరాల బందోబస్తు నిర్వహణ కోసం రూ.50 కోట్లు కేటాయించగా.. ఏపీ మార్క్ఫెడ్ తీసుకునే రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు అంగీకరించింది.
విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కాలేజ్
సామాజిక బాధ్యతకు పెద్దపీట వేస్తూ బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దివ్యాంగుల ఉన్నత విద్య, భవిష్యత్తుకు ఈ నిర్ణయం ఎంతో ఊతమివ్వనుంది.
Also Read: ఒడిశాలో ఘోర ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం!