E-Paper
Advertisement

AP Deputy CM: పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్.. కీలక ఆదేశాలు

AP Deputy CM: పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్.. కీలక ఆదేశాలు
Advertisement

AP Deputy CM Pawan Kalyan has viral fever: డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ అటాక్ అయింది. ఈ మేరకు ఆయన జ్వరం,చ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన ఫీవర్‌తో ఇబ్బంది పడుతూనే విజయవాడ వరదలపై సమీక్షలు నిర్వహించారు. గురువారం కూడా అస్వస్థతతోనే అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులు కూడా అస్వస్థతతో బాధపడుతున్నట్లు సమాచారం.

అయితే, జ్వరం ఉన్నప్పటికీ తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రస్తుతం ఆయన వైరల్ ఫీవర్ ఇంకా ఎక్కువ కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Advertisement

ఏపీలో నెలకొన్న భారీ వర్షాలతోపాటు ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పాటు బుడమేరు పొంగిపొర్లడంతో నష్టం వాటిల్లింది. అయితే దీనిపై పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. గోదావరి నదికి కూడా వరద పెరుగుతుండడంతో జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో కురిసిన ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు వాగు ప్రళయం సృష్టించింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద ప్రభావం ఎక్కువగా వచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా ఉంటున్నారు.

Advertisement

Also Read: ఎదురుగా ట్రైన్..వెనుక డ్యాం.. సీఎం ఎలా తప్పించుకున్నాడంటే?

అయితే, వరదల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఎప్పటికప్పుడూ పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. గురువారం పలు కాలనీల్లో పవన్ కల్యాణ్ పర్యటించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతూనే బాధితుల యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

 

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×