Digi Rythu Bazaar: రైతుల పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర.. వినియోగదారులకు తక్కువ ధరకు కూరగాయలు అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం డీజీ రైతు బజార్ అనే కొత్త యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా కూరగాయలను డైరెక్ట్గా రైతుల నుంచే వినియోగదారులకు విక్రయించనుంది. రైతులు తాము పండించిన కూరగాయలను దళారులకు అమ్మడం.. వారు మళ్లీ చిన్నచిన్న వ్యాపారులకు విక్రయించడం.. వారి దగ్గరి నుంచి జనం కొనుగోలు చేయడంతో ధరల భారం పూర్తిగా వినియోగదారుల జేబుల చిల్లులు పడేలా చేస్తుంది. ఈ యాప్ ద్వారా అటు రైతులకు మంచి ధర కల్పించినట్లు అవడంతోపాటు వినియోగదారులకు సైతం తాజా కూరగాయలను తక్కువ ధరకే అందించనుంది.
ఈ యాప్తో తక్కువ ధరకే కూరగాయలు..
మార్కెట్లతో పోలిస్తే డీజీ రైతు బజార్ యాప్లో ధరలు చాలా తక్కువగా, ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. రైతు బజార్ ధరలకే ఇవి లభిస్తాయి. ఎక్కడికక్కడ తాజా కూరగాయలు, నాణ్యమైన పండ్లను నేరుగా రైతుల దగ్గర సేకరించి అందించడం వల్ల తాజాదనం అలాగే ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవలు తొలి దశలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కాకినాడ వంటి మేజర్ మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రధాన పట్టణాల్లో ప్రారంభించారు. దశలవారీగా జిల్లా, మండల స్థాయి రైతు బజార్లకు విస్తరించనున్నారు.
Also Read: పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్.. రూ. 2.25 కోట్ల భారీ సాయం ప్రకటన!
డౌన్లోడ్ చేయండి.. ఆర్డర్ పెట్టండి..
మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ రైతు బజార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.. మీమీ పట్టణాల్లో కూరగాయలు ఆర్డర్ పెట్టుకొని ఇటు ధరల భారం, టైంని సేఫ్ చేసుకోండి.