E-Paper
Advertisement

పొలం మట్టికి కేసులు.. మాఫియాకు గ్రీన్ సిగ్నల్? ఏమిటీ ద్వంద్వ నీతి!

పొలం మట్టికి కేసులు.. మాఫియాకు గ్రీన్ సిగ్నల్? ఏమిటీ ద్వంద్వ నీతి!
Advertisement

Soil Mafia: కడప జిల్లాలో మట్టి మాఫియాకు అడ్డుఆపు లేకుండా పోతోంది. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వందల టిప్పర్లతో మట్టిని తరలించేస్తున్నారు. హైవే నిర్మాణానికి మట్టి అవసరమే కదా అనిపించొచ్చు. కానీ, మట్టి తవ్వకానికి అనుమతులు ఒక దగ్గర తీసుకొని.. తవ్వకాలు మరో దగ్గర చేస్తున్నారు. అంతే కాదు.. ఆ మట్టిని హైవే నిర్మాణానికి మాత్రమే వాడుతున్నారనే గ్యారెంటీ కూడా లేదు.

Advertisement

విలువైన మట్టి ఎక్కడ ఉంటే అక్కడ..

మైదుకూరు మండలం గగ్గితిప్ప దగ్గర కొండలో తవ్వకాలు చూస్తే మతి పోతుంది. మరికొన్ని రోజులు తర్వాత.. గతంలో అక్కడో కొండ ఉండేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ ఒక్క ప్రాంతంలోనే కాదు.. విలువైన మట్టి ఎక్కడ ఉంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. యదేచ్చగా దోచేస్తూ రోజూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అటు వైపు చూడడం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారుల అండదండలతోనే కొండలకు బోడిగుండులు అయిపోతున్నాయనే వాళ్లు కూడా ఉన్నారు.

Advertisement

రైతులు పొలాలకు మట్టిని తీసుకెళ్తే కేసులు పెట్టే అధికారులు.. ఏకంగా విలువైన సహజవనరులు తరలిపోతుంటే చర్యలు తీసుకోవడానికి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Also Read: ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌.. ఈ యాప్‌తో సగం ధరకే ఇంటికి తాజా కూరగాయలు..!

Tags

Related News

ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ LIVE.. పేద విద్యార్థులకు ఏఐ కోర్సుల్లో చేయూత, సదస్సులో కీలక నిర్ణయాలు

పొలిటికల్ పార్టీలకు విరాళాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

చంద్రుడిని ఢీ కొట్టిన రాకెట్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

విజయసాయి రెడ్డి కొత్త పార్టీ.. ఢీ కొడతారా?

జగన్ పర్యటనలో ప్రమాదం..

హఫీజ్‌పేట్‌లో 4 నెలలుగా పొంగి పొర్లుతున్న డ్రైనేజీ.. అధికారుల నిర్లక్ష్యంపై బిగ్ టీవీ నర్సయ్య ఫోకస్!

పెద్దపులి వేట కేసులో వీడిన మిస్టరీ

Big Stories

Advertisement
×