BigTV English
Advertisement

AP Govt: ఏపీలో రెట్టింపు సాయంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. తక్షణం అమల్లోకి..

AP Govt: ఏపీలో రెట్టింపు సాయంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. తక్షణం అమల్లోకి..

AP Govt: తీరంలోకి వెళ్తేనే వారి పూట గడిచేది. తీరాన్ని నమ్ముకున్న కుటుంబాలు అవి. చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ఇదే వారి ఉపాధి. సముద్రాన్ని నమ్ముకున్న ఆ కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అదికూడ వారికి అందించే సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. అంతేకాకుండా రెట్టింపు సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇంతకు ఏంటా సాయం తెలుసుకుందాం.


ఏపీలోని తీరప్రాంతాల్లో ఎందరో మత్స్యకారులు చేపల వేటనే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. తీరంలో చేపల వేట అంటేనే, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిందే. చేపల వేటకు వెళ్లనిదే వారికి ముద్ద పోదు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, విశాఖ, కాకినాడ, గుంటూరు, కృష్ణా ఇలా పలు జిల్లాలలో మత్స్యకారులు ఉన్నారు. ప్రతిరోజూ వేటకు వెళ్ళడం, చేపలు పట్టడం, వాటిని విక్రయించడం వీరి దినచర్య. వీరు చేపల వేటకు విరామం ప్రకటిస్తే చాలు, వీరికి ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. అందుకే ప్రభుత్వం వీరికి సాయం అందిస్తుంది.

సాధారణంగా తీరంలో ఫిషింగ్ హాలీడేని ప్రతి ఏడాది విధిస్తారు. ఆ సమయంలో తీరంలోని చేపల సంతానోత్పత్తి జరుగుతుంది. ఏప్రిల్ 14 నుండి జూన్ 14 వరకు ఫిషింగ్ హాలీడే ప్రకటిస్తారు. ఆసమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశిస్తుంది. 61 రోజులు వేటకు విరామం ప్రకటిస్తే, మత్స్యకారులకు ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. అందుకే ప్రభుత్వం వారికి ఫిషింగ్ హాలిడే సమయంలో ఆర్థిక సాయం అందిస్తుంది.


Also Read: AP Schemes: విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 15 వేలు.. ప్రభుత్వం కీలక ప్రకటన

గతంలో మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సంధర్భంగా రూ. 10 వేలు సాయం అందేది. ఆ సాయం తమకు సరిపోవడం లేదని, రూ. 20 వేలు అందించాలని మత్స్యకారుల డిమాండ్. ఈ డిమాండ్ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఫిషింగ్ హాలిడే సమయంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని పెంచుతూ, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుండి మత్స్యకారులకు అందించే సాయం రూ. 20 వేలు అందనుంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఎన్నాళ్ల నుండి వినిపిస్తున్న తమ డిమాండ్ ను ప్రభుత్వం నెరవేర్చడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×