E-Paper
Advertisement

AP Govt: ఏపీలో రెట్టింపు సాయంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. తక్షణం అమల్లోకి..

AP Govt: ఏపీలో రెట్టింపు సాయంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. తక్షణం అమల్లోకి..
Advertisement

AP Govt: తీరంలోకి వెళ్తేనే వారి పూట గడిచేది. తీరాన్ని నమ్ముకున్న కుటుంబాలు అవి. చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ఇదే వారి ఉపాధి. సముద్రాన్ని నమ్ముకున్న ఆ కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అదికూడ వారికి అందించే సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. అంతేకాకుండా రెట్టింపు సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇంతకు ఏంటా సాయం తెలుసుకుందాం.

ఏపీలోని తీరప్రాంతాల్లో ఎందరో మత్స్యకారులు చేపల వేటనే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. తీరంలో చేపల వేట అంటేనే, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిందే. చేపల వేటకు వెళ్లనిదే వారికి ముద్ద పోదు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, విశాఖ, కాకినాడ, గుంటూరు, కృష్ణా ఇలా పలు జిల్లాలలో మత్స్యకారులు ఉన్నారు. ప్రతిరోజూ వేటకు వెళ్ళడం, చేపలు పట్టడం, వాటిని విక్రయించడం వీరి దినచర్య. వీరు చేపల వేటకు విరామం ప్రకటిస్తే చాలు, వీరికి ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. అందుకే ప్రభుత్వం వీరికి సాయం అందిస్తుంది.

Advertisement

సాధారణంగా తీరంలో ఫిషింగ్ హాలీడేని ప్రతి ఏడాది విధిస్తారు. ఆ సమయంలో తీరంలోని చేపల సంతానోత్పత్తి జరుగుతుంది. ఏప్రిల్ 14 నుండి జూన్ 14 వరకు ఫిషింగ్ హాలీడే ప్రకటిస్తారు. ఆసమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశిస్తుంది. 61 రోజులు వేటకు విరామం ప్రకటిస్తే, మత్స్యకారులకు ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. అందుకే ప్రభుత్వం వారికి ఫిషింగ్ హాలిడే సమయంలో ఆర్థిక సాయం అందిస్తుంది.

Also Read: AP Schemes: విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 15 వేలు.. ప్రభుత్వం కీలక ప్రకటన

Advertisement

గతంలో మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సంధర్భంగా రూ. 10 వేలు సాయం అందేది. ఆ సాయం తమకు సరిపోవడం లేదని, రూ. 20 వేలు అందించాలని మత్స్యకారుల డిమాండ్. ఈ డిమాండ్ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఫిషింగ్ హాలిడే సమయంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని పెంచుతూ, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుండి మత్స్యకారులకు అందించే సాయం రూ. 20 వేలు అందనుంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఎన్నాళ్ల నుండి వినిపిస్తున్న తమ డిమాండ్ ను ప్రభుత్వం నెరవేర్చడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×