E-Paper
Advertisement

AP Govt: ఏపీలో రెట్టింపు సాయంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. తక్షణం అమల్లోకి..

AP Govt: ఏపీలో రెట్టింపు సాయంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. తక్షణం అమల్లోకి..
Advertisement

AP Govt: తీరంలోకి వెళ్తేనే వారి పూట గడిచేది. తీరాన్ని నమ్ముకున్న కుటుంబాలు అవి. చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ఇదే వారి ఉపాధి. సముద్రాన్ని నమ్ముకున్న ఆ కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అదికూడ వారికి అందించే సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. అంతేకాకుండా రెట్టింపు సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇంతకు ఏంటా సాయం తెలుసుకుందాం.

ఏపీలోని తీరప్రాంతాల్లో ఎందరో మత్స్యకారులు చేపల వేటనే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. తీరంలో చేపల వేట అంటేనే, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిందే. చేపల వేటకు వెళ్లనిదే వారికి ముద్ద పోదు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, విశాఖ, కాకినాడ, గుంటూరు, కృష్ణా ఇలా పలు జిల్లాలలో మత్స్యకారులు ఉన్నారు. ప్రతిరోజూ వేటకు వెళ్ళడం, చేపలు పట్టడం, వాటిని విక్రయించడం వీరి దినచర్య. వీరు చేపల వేటకు విరామం ప్రకటిస్తే చాలు, వీరికి ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. అందుకే ప్రభుత్వం వీరికి సాయం అందిస్తుంది.

Advertisement

సాధారణంగా తీరంలో ఫిషింగ్ హాలీడేని ప్రతి ఏడాది విధిస్తారు. ఆ సమయంలో తీరంలోని చేపల సంతానోత్పత్తి జరుగుతుంది. ఏప్రిల్ 14 నుండి జూన్ 14 వరకు ఫిషింగ్ హాలీడే ప్రకటిస్తారు. ఆసమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశిస్తుంది. 61 రోజులు వేటకు విరామం ప్రకటిస్తే, మత్స్యకారులకు ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. అందుకే ప్రభుత్వం వారికి ఫిషింగ్ హాలిడే సమయంలో ఆర్థిక సాయం అందిస్తుంది.

Also Read: AP Schemes: విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 15 వేలు.. ప్రభుత్వం కీలక ప్రకటన

Advertisement

గతంలో మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సంధర్భంగా రూ. 10 వేలు సాయం అందేది. ఆ సాయం తమకు సరిపోవడం లేదని, రూ. 20 వేలు అందించాలని మత్స్యకారుల డిమాండ్. ఈ డిమాండ్ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఫిషింగ్ హాలిడే సమయంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని పెంచుతూ, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుండి మత్స్యకారులకు అందించే సాయం రూ. 20 వేలు అందనుంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఎన్నాళ్ల నుండి వినిపిస్తున్న తమ డిమాండ్ ను ప్రభుత్వం నెరవేర్చడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×