E-Paper
Advertisement

AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన.. లేటెస్ట్ అప్ డేట్.. అంతా అలర్ట్

AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన.. లేటెస్ట్ అప్ డేట్.. అంతా అలర్ట్

AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో తాజా పరిస్థితులను ప్రకృతి విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. తాజా పరిస్థితులను వెల్లడించిన ఆయన, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతుందని, ఇది ప్రస్తుతానికి ట్రింకోమలీకి 130 కి.మీ, నాగపట్నానికి 400 కి.మీ,పుదుచ్చేరికి ఆగ్నేయంగా 510కి.మీ మరియు చెన్నైకి ఆగ్నేయంగా 590 కి.మీ. దూరంలో ఉందన్నారు. రానున్న 12గంటల్లో తుపానుగా బలపడనున్నట్లు కూర్మనాథ్ హెచ్చరించారు.

తదుపరి 2 రోజులలో శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదులుతూ ఉంటుందని, దీని ప్రభావంతో నేడు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 28 నుండి 30వ తేదీ వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భారీ వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతన్నలకు జాగ్రత్తలు తెలిపారు. రానున్న నాలుగు రోజులు వాతావరణం స్థితిగతులు తెలుసుకొనేందుకు ఈ వెబ్ సైట్ లింక్ ను https://apsdma.ap.gov.in/files/3e7f9efc సంప్రదించాలని ప్రకృతి విపత్తుల సంస్థ తెలిపింది.

ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ల కు ప్రభుత్వం వర్షసూచనపై ఆదేశాలు జారీ చేసింది. పలు జిల్లాలలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా తెలిపింది. అలాగే వాగులు, వంకల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భారీ నీటి ప్రవాహం సాగే సమయంలో వాగులు, వంకల వైపుకు వెళ్లరాదన్నారు.

Also Read: Balineni Srinivasa Reddy: నన్ను గెలక్కండి.. నేను నోరు తెరిస్తే.. బాలినేని మాస్ వార్నింగ్..

సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే చలిగాలుల ధాటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఏవైనా జ్వర లక్షణాలు ఉంటే స్థానిక వైద్యశాలను సంప్రదించాలని, అలాగే వైద్యసిబ్బంది అవసరమైన ప్రదేశాలలో వైద్యశిబిరాలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×