E-Paper
Advertisement

Vahana Mitra Scheme: వాహన మిత్ర పథకం దరఖాస్తులో సమస్యలా? అయితే ఇలా చేయండి?

Vahana Mitra Scheme: వాహన మిత్ర పథకం దరఖాస్తులో సమస్యలా? అయితే ఇలా చేయండి?
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందజేయనుంది. అక్టోబర్ 1న లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. అయితే అర్హులైన ఆటో డ్రైవర్లు ఈ నెల 17 నుంచి 20 తేదీ లోపు గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. అయితే దరఖాస్తు గడువును పెంచాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.

అర్జీకి ఆప్షన్

వాహన మిత్ర పథకం దరఖాస్తులో పలు సమస్యలు వస్తున్నాయి. దీంతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సమస్యలు ఉన్నవారు అర్జీ నమోదుకు సచివాలయ శాఖ ఆప్షన్ ఇచ్చింది. గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ బీఎం పోర్టల్ లాగిన్ లో ఆప్షన్ ఇచ్చారు. అర్జీ నమోదుకు వివిధ ఆప్షన్లు ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ, ఫిట్ నెస్, వెహికల్ ట్యాక్స్, ఆర్సీ సమస్యలు, తప్పు కేవైసీ, ఇతర ఆప్షన్లు ఎనెబుల్ చేశారు. ఏదైనా కారణంగా దరఖాస్తులో ఇబ్బందులు వస్తే అర్జీ చేసుకోవచ్చు.

Advertisement

వాహన మిత్ర పథకానికి కొత్తగా దరఖాస్తు చేసేందుకు నేడే(సెప్టెంబర్ 20) చివరి తేదీ కాగా, వెరిఫికేషన్ కు మాత్రం సెప్టెంబర్ 22 వరకు అవకాశం కల్పించారు.

అర్హుల మార్గదర్శకాలు ఇవే

  1. ఏపీలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  2. దరఖాస్తుదారు ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  3. వాహనం ఏపీలో రిజిస్టర్ చేసి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉండాలి.
  4. ఆటో రిక్షా ఫిట్నెస్ సర్టిఫి కెట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు. ఒక నెలలోపు ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
  5. దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  6. దరఖాస్తుదారుడు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి/ పెన్షనర్ గా ఉండకూడదు.
  7. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు నిబంధనల మినహాయింపు ఉంటుంది.
  8. ఇంటి కరెంట్ బిల్లు నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తుకు ముందు 12 నెలల సగటును లెక్కిస్తారు.
  9. వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, ఫైన్లు ఉండకూడదు.
  10. మాగాణి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాల లోపు వారు అర్హులు.
  11. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస, వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.

Also Read: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల స్కామ్.. టీటీడీ బోర్డు సభ్యుడు సంచలన ఆరోపణలు

అక్టోబర్ 1న ఖాతాల్లో డబ్బులు

Advertisement

వాహనమిత్ర పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరాకు ఈ పథకాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిన్న జరిగిన మంత్రివర్గ భేటీలో పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంది. అర్హుల జాబితాపై అధికారులకు సూచనలు చేసింది. అర్హులైన వారి ఖాతాల్లో రూ.15 వేలు జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 1న లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×