E-Paper
Advertisement

Tirumala: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల స్కామ్.. టీటీడీ బోర్డు సభ్యుడు సంచలన ఆరోపణలు

Tirumala: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల స్కామ్.. టీటీడీ బోర్డు సభ్యుడు సంచలన ఆరోపణలు
Advertisement

Tirumala: ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరచూ వార్తల్లో నిలుస్తుంది. కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ కొట్టిపారేస్తుంది. అయితే ఈసారి టీటీడీ బోర్డు సభ్యుడే సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయాన్ని భద్రపరిచి, లెక్కించే ‘పరకామణి’లో అవకతవకలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. పరకామణిలో రూ. 100 కోట్ల చోరీ జరిగిందని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

చోరీ సొత్తు రియల్ ఎస్టేట్ లో

శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భాను ప్రకాష్ రెడ్డి.. పలు వీడియోలు ప్రదర్శించారు. రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తున్నట్లు ఈ వీడియో ఉందని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. గత కొన్నేళ్లుగా రవికుమార్ ఈ తరహా చోరీలు చేస్తూ ఆ డబ్బులను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెడుతున్నారని ఆరోపించారు. ఒకరి నుంచి మరొకరు ఇలా దొంగలు అందరూ స్వామివారి సొమ్మును దోచుకున్నారన్నారు.

Advertisement

“గత ప్రభుత్వంలో రూ.100 కోట్లు అప్పటి అధికారుల చేతులు మారింది. ఎవరెవరు, ఎంతెంత, ఎక్కడ డబ్బులు స్వాహా చేశారో రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి. చెన్నైలోని టీటీడీ ఆస్తులను బదలాయించుకున్న అధికారులు ఎవరు? రాజీ చేసుకున్న అధికారులు ఎవరు? రాజీ చేసిన పెద్ద మనుషులు ఎవరు? నేను పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను”- టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి

సీఐడీ విచారణ

టీటీడీ చరిత్రలో అత్యంత భారీ చోరీ గత ప్రభుత్వంలో జరిగిందని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. స్వామి వారి హుండీలో భక్తులు ఎంతో భక్తితో వేసిన కానుకలను కొందరు దోచుకున్నారన్నారు. రూ.100 కోట్ల పైగా పరకామణిలో చోరీ జరిగిందన్నారు. ఈ కేసును హైకోర్టు సీఐడీకి అప్పగించిందని, వచ్చే నెల రోజుల్లో విచారణ జరిపి సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి బోర్డు నిర్ణయాలను ఇతర డాక్యుమెంట్లను అన్నింటిని సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించిందని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Also Read: బోండా ఉమ ఓవర్ చేస్తుండు.. సంగతేంటో చూడండి.. బాబుకు పవన్ కంప్లైంట్

దోచుకున్న సొమ్ము తాడేపల్లి ప్యాలెస్ కు?

ఈ కేసులో చాలా మంది వైసీపీ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. త్వరలోనే అందరి పేర్లు బయటకు పడతాయన్నారు. త్వరలోనే ఓ అధికారి రూ. 100 కోట్ల స్కామ్ కు సంబంధించిన అన్ని వివరాలను బయటపెట్టబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సొత్తును దోచుకునేందుకు ఓ పోలీస్ అధికారి కీలకంగా వ్యవహరించారన్నారు. ఈ స్కామ్ జరిగినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఛైర్మన్ గా ఉన్నారని, దీనిపై ఆయన సమాధాన చెప్పాలని డిమాండ్ చేశారు. దోచుకున్న సొమ్మును తాడేపల్లి ప్యాలెస్ చేర్చారన్నారు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×