Big Stories

AP Group 1 Prelims: నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. 144 సెక్షన్ అమలు!

AP Group 1 Prelims newsAP Group 1 Prelims News: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభమైంది. ఈ పరీక్షకు అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎస్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షను మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు రాయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాల్లోను అభ్యర్థులను పరీక్షలు రాస్తున్నారు.

- Advertisement -

Also Read: Delhi AP Bhavan : పదేళ్లకు ఏపీ భవన్‌ విభజన పూర్తి.. కేంద్రం ఆమోదం..

ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాల పరిధిలో పరీక్ష ముగిసే వరకు 144వ సెక్షన్ అమలులో ఉంటుంది.

పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పటిష్ఠమైన బందోబస్తును అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్‌ అధికారిని ఇన్‌చార్జిగా ప్రభుత్వం నియమించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News