BigTV English
Advertisement

Balakrishna: నన్ను మన్నించండి.. ఎమ్మెల్యే బాలకృష్ణ పశ్చాత్తాపం.. ఎందుకంటే?

Balakrishna: నన్ను మన్నించండి.. ఎమ్మెల్యే బాలకృష్ణ పశ్చాత్తాపం.. ఎందుకంటే?

Balakrishna: బాలకృష్ణ అంటే సినిమాలు, డ్యాన్సులు, నరకడాలు, ఫ్యాక్షన్, పంచ్ డైలాగులు, అభిమానులను కొట్టడాలు.. ఇవే కావు. ఆయనలో మరో మనిషి ఉన్నాడు. మంచి మనిషి దాగున్నాడు. పెద్దలంటే గౌరవం.. పిల్లలపై ప్రేమ.. అభిమానులపై ఆప్యాయత.. అబ్బో సకల సుగుణాభిరాముడు మన బాలయ్య..అని ఆయన దగ్గరి వాళ్లు అంటుంటారు. కాకపోతే, కాస్త దూకుడెక్కువ. చేతికి, నోటికి కాస్త కంట్రోల్ తక్కువ. అలానే, ఇటీవల బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఓ వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ విషయం తెలిసి.. బాలయ్య తనను మన్నించమని వేడుకున్నారు. తన పశ్చాత్తాపాన్ని ప్రకటించి.. మంచి మనసును చాటుకున్నాడు.


దేవ బ్రాహ్మణులపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) వివరణ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో తాను అలా మాట్లాడానని అన్నారు. ఎదుటివాళ్లను బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.

‘‘నా మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి బాధపడ్డా. నాకు ఎవరినీ బాధపెట్టాలన్న ఆలోచన లేదు. నేను ఎదుటివాళ్లను బాధపెట్టే వ్యక్తిని కాదని మీకు తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలా మాట్లాడాను. సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకేం ప్రయోజనం? నా వాళ్లను నేను బాధ పెట్టుకుంటానా? అర్థం చేసుకుని నా పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మరి, దేవాంగులు ఎలా స్పందిస్తారో చూడాలి.


ఇంతకీ దేవాంగుల గురించి బాలకృష్ణ ఏమన్నారంటే.. ‘దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ’

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×