E-Paper
Advertisement

Big Shock to YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం

Big Shock to YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం
Advertisement

అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం అయిన తెలుగు దేశం పార్టీ అధికారం సాధించి కీలకమైన ఛైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి టీడీపీ తరఫున మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.

ఎన్నికల పోలింగ్ సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరుకావడంతో బలాబలాలు మారిపోయాయి. దీంతో టీడీపీకి పరిస్థితులు అనుకూలంగా మారాయి. మొత్తం 25 మంది కౌన్సిలర్లలో టీడీపీకి 14 మందిమద్దతు లభించగా.. వైఎస్సార్‌సీపీకి కేవలం 11 మంది మాత్రమే మద్దతు ప్రకటించారు. ఈ స్పష్టమైన అధికారంతో టీడీపీ ఆధ్వర్యంలో తలారి గౌతమి విజయం సాధించారు.

Advertisement

కల్యాణదుర్గం మున్సిపాలిటీలో ఈ ఫలితం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో సాధించిన విజయంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్న నేపథ్యంలో ఛైర్మన్ పదవి గెలుచుకోవడం వారికి మరింత బలం చేకూర్చింది. కానీ.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో మాత్రం నిరాశ వెల్లివిరిసింది.

ALSO READ: Panchayat Election Results: సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ఇది బీఆర్ఎస్ పరిస్థితి..!

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×