E-Paper
Advertisement

ఏపీకి క్యారియర్ ధమాకా.. లోకేష్ స్పీడ్‌కు ఫిదా అయిన అమెరికా దిగ్గజం

ఏపీకి క్యారియర్ ధమాకా.. లోకేష్ స్పీడ్‌కు ఫిదా అయిన అమెరికా దిగ్గజం
Advertisement

Carrier AC plant: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్ కండిషనర్ల తయారీ సంస్థ క్యారియర్ తన నూతన ప్లాంట్‌కు శ్రీకారం చుట్టింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టుకు ఘనంగా శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా.. స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ అడుగు పడినట్లు కనిపిస్తోంది.

అమెరికాకు చెందిన ఈ దిగ్గజ సంస్థ దాదాపు రూ. 1000 కోట్ల భారీ పెట్టుబడితో ఇక్కడ తన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. శ్రీసిటీలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ రూపు దిద్దుకోనుంది. ముఖ్యంగా గృహేతర అవసరాలకు ఉపయోగపడే భారీ స్థాయి ఏసీల తయారీపై ఈ సంస్థ దృష్టి సారించింది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలవుతాయి.

Advertisement

ఈ ప్రాజెక్ట్ వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం ఉపాధి కల్పన. సుమారు 3000 మందికి ఈ పరిశ్రమ ద్వారా పని లభిస్తుందని అంచనా. ఇందులో 1000 మందికి నేరుగా, మరో 2000 మందికి అనుబంధ రంగాల ద్వారా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగు పరిచేందుకు.. కొత్త కంపెనీలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఈ క్యారియర్ పరిశ్రమ రాక ఒక నిదర్శనమని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో శ్రీనిటీ మరిన్ని అంతర్జాతీయ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశం ఉంది.

Also Read:  ఇరాన్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

Advertisement

Related News

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

Big Stories

Advertisement
×