E-Paper
Advertisement

Vizag : మహిళా సీఐ దందా.. రూ. 2 వేల నోట్ల వ్యవహారంలో కేసు నమోదు..

Vizag : మహిళా సీఐ దందా.. రూ. 2 వేల నోట్ల వ్యవహారంలో కేసు నమోదు..
Advertisement

Vizag : ఏపీలో రూ.2 వేల నోట్ల మార్పిడి కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో
కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత, మరో ముగ్గురి నిందితులపై విశాఖ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. హోంగార్డులు శ్యామ్‌సుందర్ , శ్రీనుపైనా కేసులు నమోదయ్యాయి. నోట్ల మార్పిడి కేసులో మధ్యవర్తిగా సూరిబాబు అనే వ్యక్తి వ్యవహరించారు. అతడిపై విశాఖ ద్వారకా పోలీసులు 341, 386, 506 సెక్షన్ల కింద కేసులు ‌ నమోదు చేశారు.

సీతమ్మదార ప్రాంతంలో స్వర్ణలత రాత్రి విధుల్లో ఉండగా సూరిబాబు రూ.90 లక్షల విలువైన రూ.2వేల నోట్లతో పట్టుబడ్డాడు. దీంతో స్వర్ణలత సూరిబాబును బెదిరించారు. అందులోంచి రూ.12 లక్షలు తీసుకున్నారని దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. ఈ విషయంలో నౌకాదళ సిబ్బంది కొల్లి శ్రీను, శ్రీధర్‌ విశాఖ నగర సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు విచారణను పోలీసులు చేపట్టారు. స్వర్ణలత బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Related News

DSC జూడో సర్టిఫికెట్ల వివాదంపై.. క్లారిటీ ఇచ్చిన ఎండీ భరణి!

కొత్త పార్టీపై క్లారిటీ, నేను సీఎం అభ్యర్థిని కాను-విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

AP DSC-2025 అక్రమాలపై డొంక కదిలింది.. నిన్న స్పోర్ట్స్, నేడు దివ్యాంగుల కోటా, బయటపెట్టిన బిగ్‌ టీవీ

డబ్బులు ఇవ్వలేదని.. యువకుడ్ని తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన మెకానిక్, భోగాపురంలో ఘటన

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

Big Stories

Advertisement
×