E-Paper
Advertisement

Vizag : మహిళా సీఐ దందా.. రూ. 2 వేల నోట్ల వ్యవహారంలో కేసు నమోదు..

Vizag : మహిళా సీఐ దందా.. రూ. 2 వేల నోట్ల వ్యవహారంలో కేసు నమోదు..

Vizag : ఏపీలో రూ.2 వేల నోట్ల మార్పిడి కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో
కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత, మరో ముగ్గురి నిందితులపై విశాఖ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. హోంగార్డులు శ్యామ్‌సుందర్ , శ్రీనుపైనా కేసులు నమోదయ్యాయి. నోట్ల మార్పిడి కేసులో మధ్యవర్తిగా సూరిబాబు అనే వ్యక్తి వ్యవహరించారు. అతడిపై విశాఖ ద్వారకా పోలీసులు 341, 386, 506 సెక్షన్ల కింద కేసులు ‌ నమోదు చేశారు.

సీతమ్మదార ప్రాంతంలో స్వర్ణలత రాత్రి విధుల్లో ఉండగా సూరిబాబు రూ.90 లక్షల విలువైన రూ.2వేల నోట్లతో పట్టుబడ్డాడు. దీంతో స్వర్ణలత సూరిబాబును బెదిరించారు. అందులోంచి రూ.12 లక్షలు తీసుకున్నారని దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. ఈ విషయంలో నౌకాదళ సిబ్బంది కొల్లి శ్రీను, శ్రీధర్‌ విశాఖ నగర సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు విచారణను పోలీసులు చేపట్టారు. స్వర్ణలత బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×