BigTV English
Advertisement

Chandrababu: చంద్రబాబుపై కేసు.. మరో వెయ్యి మందిపై కూడా.. అనపర్తి ఎఫెక్ట్

Chandrababu: చంద్రబాబుపై కేసు.. మరో వెయ్యి మందిపై కూడా.. అనపర్తి ఎఫెక్ట్

Chandrababu: చంద్రబాబును వదల బొమ్మాలి టైపులో వెంటాడుతున్నారు పోలీసులు. శుక్రవారం బాబు టూర్ కు అనేక ఆటంకాలు కలిగించగా.. శనివారం కూడా అదే టెంపో కంటిన్యూ చేశారు. అనుమతి లేకుండా సభ నిర్వహించారంటూ చంద్రబాబు మీద కేసులు పెట్టారు. ఆయనతో పాటు మరో వెయ్యి మందిపై కేసులు నమోదు చేశారు. అనపర్తి ఘటనపై డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు మేరకు 143, 353, 149 సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేయడం టీడీపీని షాక్ కు గురి చేసింది.


ఆయా కేసుల్లో చంద్రబాబునే ఏ1 గా నమోదు చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఏ2, జవహర్‌ను ఏ3గా చేర్చారు. స్వామినాయుడు, చినరాజప్ప, జ్యోతుల నవీన్‌, మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, బత్తుల ఆనందరావు, గొల్లపల్లి సూర్యారావులపై కేసులు ఫైల్ అయ్యాయి. అనపర్తి, బిక్కవోలు పీఎస్ ల పరిధిలో మొత్తం 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి.

అనపర్తి దేవీచౌక్‌ సెంటరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభకు అనుమతి లేకపోయి సభ నిర్వహించారని ఐజీ పాలరాజు అన్నారు. “అనపర్తిలో రోడ్డుపై చంద్రబాబు సభ నిర్వహించడానికి వీల్లేదని ముందే చెప్పాం. రెండు సభా స్థలాలు కూడా చూపించాం. పార్టీ నేతలతో మాట్లాడి చెబుతామని చెప్పిన స్థానిక నాయకులు.. చివరకు రోడ్డుపైనే సభ నిర్వహించారు. ర్యాలీగా వెళ్లటానికి మాత్రమే అనుమతి ఉంది. సభకు అనుమతి లేదు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. బస్సు అద్దాలు పగలగొట్టారు. కొందరు రాళ్లు విసరడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. రోడ్డుపైనే సభలు నిర్వహిస్తామంటే చట్టం తనపని తాను చేస్తుంది” అని ఐజీ పాలరాజు చెప్పారు.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×