E-Paper
Advertisement

Amaravati : అమరావతిలో ఇళ్ల నిర్మాణం.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్..

Amaravati : అమరావతిలో ఇళ్ల నిర్మాణం.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్..
Advertisement

Amaravati : ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఇక్కడ 47,017 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అయితే నిధులను మాత్రం కోర్టు కేసు తేలాకే ఇస్తామని షరతు విధించింది.

రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో బలహీనవర్గాలకు గతంలో కేటాయించిన 46,928 ఇళ్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వాటి స్థానంలో అమరావతి ప్రాంతంలో పీఏంఏవై-అర్బన్‌ కింద 47,017 ఇళ్లు మంజూరు చేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. గత నెల 26న జరిగిన సెంట్రల్‌ శాంక్షనింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ 67వ సమావేశంలో ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం గడువు ముగిసేలోపు కోర్టు కేసులు పరిష్కారమైతేనే నిధులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించుకోవాలని కేంద్రం స్పష్టంచేసింది.

Advertisement

బయటి ప్రాంతాలకు చెందినవారికి అమరావతిలో స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించింది. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసింది. కొత్తగా ఆర్‌5 జోన్‌ను సృష్టించింది. విజయవాడ, పెదకాకాని, దుగ్గిరాల, మంగళగిరి ప్రాంతాలకు చెందిన 47,017 మందికి ఇళ్ల పట్టాలిచ్చింది. దీనిపై కొందరు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఆ స్థలాలపై పట్టాదారులకు హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Related News

DSC జూడో సర్టిఫికెట్ల వివాదంపై.. క్లారిటీ ఇచ్చిన ఎండీ భరణి!

కొత్త పార్టీపై క్లారిటీ, నేను సీఎం అభ్యర్థిని కాను-విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

AP DSC-2025 అక్రమాలపై డొంక కదిలింది.. నిన్న స్పోర్ట్స్, నేడు దివ్యాంగుల కోటా, బయటపెట్టిన బిగ్‌ టీవీ

డబ్బులు ఇవ్వలేదని.. యువకుడ్ని తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన మెకానిక్, భోగాపురంలో ఘటన

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

Big Stories

Advertisement
×