E-Paper
Advertisement

TTD Chairman: శ్రీవారి దర్శనం తాజా అప్ డేట్.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

TTD Chairman: శ్రీవారి దర్శనం తాజా అప్ డేట్.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
Advertisement

TTD Chairman: భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా సహించను. కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగాలి. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు ముందస్తుగా తీసుకోండంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడుకు టీటీడీ ఈవో శ్యామల రావు అందించి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో అందించారు.

శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వి.వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఇక కార్తీకమాసం ఎఫెక్ట్ తిరుమలలో కనిపిస్తోంది. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.

Also Read: Rasi Phalalu Nov 17: ఏ ఏ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందంటే ?

Advertisement

కార్తీక మాసం ఎఫెక్ట్.. తిరుమలలో రద్దీ
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 73,179 మంది భక్తులు దర్శించుకోగా.. 25,602 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.03 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే 17 కంపార్ట్ మెంట్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×