E-Paper
Advertisement

Chandrababu : కూల్చివేతలు మానండి..ఏదైనా నిర్మించి చూడండి: చంద్రబాబు

Chandrababu : కూల్చివేతలు మానండి..ఏదైనా నిర్మించి చూడండి: చంద్రబాబు
Advertisement

Chandrababu : వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేత ఘటనపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం దిక్కుమాలిన పనులు చేస్తోందని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌ చేసిన తప్పులు 100 దాటిపోయాయని ఆరోపించారు. ఇక ప్రభుత్వ పతనమే మిగిలిందని విమర్శించారు. ఏపీ‌ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు,అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 600 ఇళ్లు ఉన్న ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు విస్తరిస్తారా? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ అసలు ఏనాడైనా రోడ్లు వేసిందా అని చంద్రబాబు నిలదీశారు. జనసేన అధినేత పవన్‌ పర్యటన అడ్డుకుంటేనో, టీడీపీ నేతల పర్యటన సమయంలో రాళ్లు వేస్తేనో పైచేయి సాధించలేరని హితవు పలికారు. కూల్చడం మాని ఏదైనా నిర్మించి చూడాలన్నారు. అప్పుడు ఆ తృప్తి ఎలా ఉంటుందో తెలుస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×