BigTV English

Chandrababu Comments: ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు? : చంద్రబాబు

Chandrababu Comments: ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు? : చంద్రబాబు

Chandrababu Comments on YS Jagan(Andhra politics news): ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ప్రజాగళం సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ నేత, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితోపాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచేశారని అన్నారు. జగన్ ఐదేళ్లు పరదాల చాటున తిరిగారని, ఆయనను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇగ ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు దగ్గరకు వెళ్లి ఓటు అడుగుతావంటూ ప్రశ్నించారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదని, జగన్ పాలనలో 9 సార్లు కరెంటు బిల్లులు పెరిగాయన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంటా అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.


అదేవిధంగా రాజంపేటలో కూడా ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని, జగన్ ఇంటికి పోవడం తప్పదని చంద్రబాబు అన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చి అభివృద్ధి చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అప్పటివరకు నిరుద్యోగ భృతి కూడా చెల్లిస్తామన్నారు.

Also Read:వైసీపీని తొక్కేద్దాం.. కూటమిని తెచ్చేద్దాం: పవన్ కళ్యాణ్


జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల్లోనే ఉందని, ఆ పరిస్థితి మారాలంటూ ఆయన పేర్కొన్నారు. జగన్ ఓడిపోతాడని ముందే పసిగట్టి 70 స్థానాల్లో అభ్యర్థులను మార్చారని పవన్ అన్నారు. వైసీపీని తొక్కేద్దాం.. కూటమి పాలన తెచ్చేద్దామంటూ పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×