E-Paper
Advertisement

Chandrababu Naidu| ఆంధ్రలో పారిశ్రామిక అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్.. వంద రోజుల్లో కీలక పాలసీలు!

Chandrababu Naidu| ఆంధ్రలో పారిశ్రామిక అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్.. వంద రోజుల్లో కీలక పాలసీలు!
Advertisement

Chandrababu Naidu latest news(Andhra politics news): ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్టంలో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. చిన్న పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటి, ఎలెక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్ పరిశ్రమలు ఏపీలో అభివృద్ధి చేయడానికి అయిదు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని పరిశ్రమల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ పాలసీలు వంద రోజుల్లో రూపొందించాలని.. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు. చంద్రబాబు పరిశ్రమల శాఖ అధికారులతో ఓ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు.

Also Read: అదే స్వామిభక్తి ! ప్రభుత్వం మారినా.. మారని పోలీసుల తీరు

Advertisement

సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నాలుగు పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నారు. కుప్పం, ములాపేట్, చిలమట్టూరు, దోణకొండ ప్రాంతాలలో ఈ పారిశ్రామిక కేంద్రాలు చంద్రబాబు ప్లాన్. ఫార్మా, ఎలెక్ట్రానిక్, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్ వేర్ పరిశ్రమలకు ఈ నాలుగు ప్రాంతాల వనరులు ఉపయోగకరంగా ఉంటాయని సిఎం చంద్రబాబు సమావేశంలో అధికారులకు సూచించారు. వీటితో పాటు కృష్టపట్నం, ఓర్వకల్, నక్కపల్లి, కొప్పర్తి ప్రాంతాలన కూడా పరిశీలించాలని చెప్పారు. మాలవల్లి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు భూములు కేటాయించేందుకు స్థలాల ధరలను తగ్గించాలని అన్నారు.

ALSO READ: వైసీపీలో ఏం జరుగుతోంది? జగన్ కంటే కేతిరెడ్డి బెటర్..

Advertisement

ఈ సమావేశం ముగిసిన తరువాత పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఈ కారణంగా పెట్టుబడులు కరువయ్యయని ఆయన చెప్పారు. ”ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు 1382 ఎకరాల భూమిని పరిశ్రమల అభివృద్ధి కోసం సమీకరించి దాన్ని హౌసింగ్ ప్లాట్ల కోసం జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటు కోసం టిడిపి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

Also Read: ఆగస్టు 2న ఏపీ కేబినెట్ భేటీ.. ఏం చర్చించబోతున్నారంటే..?

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×