E-Paper
Advertisement

Chandrababu: సమైక్యాంధ్ర ప్రకటనలా?.. వైసీపీ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం..

Chandrababu: సమైక్యాంధ్ర ప్రకటనలా?.. వైసీపీ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం..
Advertisement

Chandrababu: సజ్జల రాజేసిన సమైక్య రాష్ట్రం మంటలు ఎగిసిపడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అగ్గి రాజుకుంది. రెండు రాష్ట్రాలను కలపాలన్న సజ్జల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకోగానీ టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం మౌనంగా ఉన్నాయి. ఉద్యమ సమయంలో టీడీపీ, బీజేపీలు రాష్ట్ర విభజనకు మద్దతు పలికాయంటూ మళ్లీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేయడంతో టీడీపీ అలర్ట్ అయింది. స్వయంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబే రంగంలోకి దిగి సజ్జల కామెంట్లను తప్పుబట్టారు.

ప్రజా సమస్యలను పక్కనపెట్టి సమైక్య రాష్ట్రం ప్రకటనలా? అంటూ నిలదీశారు చంద్రబాబు. సమైక్యాంధ్ర అంటూ ప్రజలను మభ్యపెట్టడం మోసపూరితమన్నారు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మండిపడ్డారు. చేసిన తప్పులను ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాలని హితవు పలికారు.

Advertisement

ఏపీలో రైతు ఆత్యహత్యలు పెరగడం ఆందోళనకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. 3 ఏళ్లలోనే 1673 మంది రైతుల ఆత్మహత్యలతో సూసైడ్స్ స్టేట్‌గా మారిందన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే రైతులు అప్పుల పాలవుతున్నారని.. మద్దతు ధర, సబ్సిడీలు లేకపోవడంతోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. సర్కారు సత్వరం స్పందించి అన్నదాతలకు అండగా నిలవాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు.

Related News

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

Big Stories

Advertisement
×