E-Paper
Advertisement

Chandrababu: ప్రజాకోర్టులో పెడతాం.. వివేకా మర్డర్ కేసు పోలీసులకు కేస్‌ స్టడీ: చంద్రబాబు

Chandrababu: ప్రజాకోర్టులో పెడతాం.. వివేకా మర్డర్ కేసు పోలీసులకు కేస్‌ స్టడీ: చంద్రబాబు
Advertisement
jagan chandrababu

Chandrababu: వివేక హత్య కేసు ఎంపీ అవినాస్‌రెడ్డి అరెస్ట్ వరకూ వచ్చింది. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో కాస్త ఊరట లభించింది. అయినా, ఈ నెల 25 తర్వాత ఏం జరుగుతుందోననే టెన్షన్ కంటిన్యూ అవుతోంది. అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం.. సీబీఐ కస్టడీకి తీసుకోవడం.. రాజకీయంగా కలకలం రేపింది. ఇదంతా సునీత, సీబీఐ, చంద్రబాబు కలిసి చేస్తున్న కుట్ర అంటూ వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అటు, టీడీపీ సైతం ధీటుగా జవాబిస్తోంది.

వివేకా హత్య కేసును ప్రజాకోర్టులో పెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ కేసు.. ప్రపంచంలోని పోలీసు అధికారులకు కేస్‌ స్టడీలాంటిదన్నారు. నిందితులు సీబీఐ అధికారులనూ బెదిరించారని.. గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. ఇలాంటి రౌడీల తోకలు కట్‌ చేస్తామని హెచ్చరించారు చంద్రబాబు.

Advertisement

వివేకా హత్య కేసులో నిందితులను సీబీఐ అరెస్ట్ చేస్తే.. వైసీపీ నాయకులు నిరసన ర్యాలీలు తీయడం సిగ్గు చేటని చంద్రబాబు ధ్వజమెత్తారు. తండ్రి హత్య కేసులో న్యాయం కోసం ఒక ఆడ బిడ్డ పోరాడుతుంటే అండగా ఉండాల్సింది పోయి వ్యతిరేక ర్యాలీలు తీసారని ఫైర్ అయ్యారు. మానవత్వం ఉన్న పోలీసులు, లాయర్లు, ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి మర్డర్‌ను ఖండించాలన్నారు.

వారికి అడ్డువచ్చిన వారందర్నీ చంపేస్తారా? రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను పూర్తిగా అణచివేసింది టీడీపీనేనని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక హత్యలు, దౌర్జన్యాలు, బలహీనవర్గాలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. కడప సభలో వైసీపీపై నిప్పులు చెరిగారు చంద్రబాబు.

Advertisement

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×