E-Paper
Advertisement

CM Chandrababu: జగన్‌‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్, రౌడీయిజం చేస్తామంటే ఉపేక్షించం

CM Chandrababu: జగన్‌‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్, రౌడీయిజం చేస్తామంటే ఉపేక్షించం
Advertisement

CM Chandrababu: వైసీపీ అధినేత జగన్‌కు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రౌడీయిజం చేస్తామంటే ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఇప్పటివరకు మంచి తనాన్ని చూశారని, ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. గురువారం ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బాబాయ్‌ను చంపి ఆనాటి ముఖ్యమంత్రి చేతిలో కత్తి పెట్టే ధైర్యం నేరస్తులకు వచ్చిందంటే ఊహించుకోగలమా అంటూ ప్రశ్నించారు. దాన్ని నమ్మించడానికి సాక్షి పత్రిక, ఛానెల్ పదే పదే చెప్పి సానుభూతి సంపాదించారన్నారు. తెనాలి వ్యవహారం ఏంటని సూటిగా వైసీపీని ప్రశ్నించారు.

Advertisement

గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లను పరామర్శిస్తారా? ఈ విషయంలో ప్రజలు మీకు సపోర్టు చేయాలా? ఒంగోలు పొగాకు రైతుల వ్యవహారాన్ని గుర్తు చేశారు. నష్టం వచ్చినా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. బాధ్యత లేకుండా 15 వేల మందిని వెంటేసుకు పోయి రౌడీయిజం చేస్తారా? అమరావతి దేవతల రాజధాని, అది వేశ్యల నగరమా? అంటూ విరుచుకుపడ్డారు.

మీరెంత కొవ్వెక్కి ఉన్నారు? మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. కొంతమంది విష ప్రచారం చేసి రౌడీయిజం చేసి పెత్తనం చేయాలని భావిస్తున్నారని అన్నారు. అలాంటి ఆటలు తన వద్ద సాగవన్నారు. ఇంతవరకు తన మంచితనం చూశారని ఇక ముందు తోక జాడిస్తే మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు. గుణపాఠం తప్పదని ఘాటుగా హెచ్చరించారు.

Advertisement

ALSO READ: జగన్ ఫ్యూచర్ ఇదే.. రఘురామరాజు షాకింగ్ కామెంట్స్

11 సీట్లతో ప్రజలు బుద్ది చెప్పినా బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారని రుసరుసలాడారు.  తాము ఎలా వ్యవహరిస్తామో త్వరలో చూపిస్తామన్నారు.  గంజాయ్ బ్యాచ్, అమరావతి వ్యవహారం, ఒంగోలు రౌడీయిజంపై తొలిసారి ఓపెన్‌గా మాట్లాడారు సీఎం చంద్రబాబు.  తొలిసారి ఈ విధంగా స్పందించారలని అంటున్నారు ఆ పార్టీ నేతలు.

పనిలో పనిగా కూటమి సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై వైసీపీ చేస్తున్న దుష్ఫచారాన్ని ఖండించారు సీఎం చంద్రబాబు. సూపర్ సిక్స్ హామీలపై క్లారిటీ ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు.  ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమం అమలు చేస్తున్నామని, శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తామంటే కుదరదన్నారు.

 

Related News

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్ మున్సిపల్‌గా తిరుపతి.. పెరిగిన డివిజన్లు!

విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!

రోడ్లు, పార్కింగ్ కూడా ప్రభుత్వమే కట్టాలా? విశాఖ ఐటీ కంపెనీ వింత డిమాండ్లు!

Big Stories

Advertisement
×