E-Paper
Advertisement

విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ, సీఎం చంద్రబాబు హర్షం, జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌

విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ, సీఎం చంద్రబాబు హర్షం, జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌
Advertisement

Visakhapatnam: ఎట్టకేలకు ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారం అయ్యింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది కేంద్రప్రభుత్వం. జూన్‌ ఒకటి నుంచి విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని గెజిట్‌లో ప్రస్తావించింది.

విశాఖ రైల్వేజోన్‌పై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

Advertisement

విశాఖ జోన్‌ పరిధిలోకి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను చేర్చింది. ఇకపై దక్షిణ మధ్య రైల్వే-తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను తీసుకుని దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ‌లో కలుపుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖలో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుతుందన్నారు.

Advertisement

సీఎం చంద్రబాబు హర్షం..  జూన్ ఒకటి నుంచి కార్యకలాపాలు‌

నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్- రాయగడ డివిజన్ ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని రాసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి- ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహద పడుతుందన్నారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి గెజిట్ విడుదల చేసిన ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుతం దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయాల నిర్మాణం పనులు ఆరిలోవలో జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వీఎంఆర్‌డీఏ భవనంలోని రెండు అంతస్తుల్లో దక్షిణ కోస్తా రైల్వే జీఎం తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్రం రైల్వే జోన్‌ ఏర్పాటుపై ప్రకటన చేసిన విషయం తెల్సిందే.

ALSO READ: సీఎం చంద్రబాబుకు మేనకాగాంధీ లేఖ..దయచేసి ఆపండి, మారణకాండ గురించి మీరేమీ చేయలేరా? 

2025 జనవరిలో డీపీఆర్‌కు ఆమోదం పొందడంతో అదే నెలలో జోనల్‌ కార్యాలయం నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. జోన్‌ కార్యకలాపాలకు కీలకమైన అధికారుల నియామకం జరిగిపోయింది. చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్, చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్, చీఫ్‌ ఇంజినీర్, చీఫ్‌ పర్సనల్‌ ఆఫీసర్, చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారుల నియామకం జరిగిపోయింది.

ఇతర డివిజన్ల నుంచి 3వేల మంది విశాఖ జీఎం కార్యాలయంలో పని చేయడానికి ఆసక్తి చూపారు. జీఎం కార్యాలయంలో 1200 మంది సిబ్బంది అవసరం ఉంది. జోన్‌ కార్యకలాపాల తర్వాత దాదాపు 17వేల మంది వరకు సిబ్బంది పని చేయనున్నారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×