E-Paper
Advertisement

CM Chandrababu: మరోసారి మంత్రులపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఇలానే కంటిన్యూ అయితే కష్టం.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

CM Chandrababu: మరోసారి మంత్రులపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఇలానే కంటిన్యూ అయితే కష్టం.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మంత్రివర్గ సహచరుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రివర్గం సమర్థవంతంగా పనిచేయడం లేదంటూ ఆయన ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు సాధించడంలో మంత్రులు విఫలమవుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నతాధికారులైన హెచ్‌ఓడీలు (HODs), సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కీలక అంశాన్ని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మంత్రుల పని తీరుపై సీఎం ఫైర్

Advertisement

సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు గడుస్తున్నప్పటికీ, చాలా మంది మంత్రుల పనితీరులో ఎలాంటి సానుకూల మార్పు కనిపించకపోవడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదు. 18 నెలలైనా పనితీరులో మార్పు రాలేదంటూ ఆయన అసంతృప్తిని స్పష్టం చేశారు. మంత్రుల బాధ్యత కేవలం స్థానిక పరిపాలనకే పరిమితం కాకుండా, రాష్ట్రానికి అత్యంత కీలకం అయిన కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాలని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో మంత్రులు విఫలమవుతున్నారని, ఇది రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగిస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిధులు తీసుకురావడంలో మంత్రుల విఫలం..

Advertisement

కేంద్రం నుంచి నిధులు సాధించడానికి మంత్రులు సరైన వ్యూహాన్ని అనుసరించడం లేదనేది సీఎం ప్రధాన అభ్యంతరం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలం అవుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరపడం అత్యవసరమని ఆయన సూచించారు. ఢిల్లీకి అధికారాలతో కలిసి వెళ్తే, సంబంధిత పథకాలకు కేంద్ర నిధులు వస్తాయని ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

కేవలం ఒక రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లడానికి మంత్రులు వెనుకడుగు వేయడం సరికాదని ఆయన హితవు పలికారు. మంత్రులు ఒక్క రోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టమేమి లేదని స్పష్టం చేస్తూ.. దీనివల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల వేగం మందగిస్తోందనే ఆందోళన సీఎం చంద్రబాబు నాయుడు మాటల్లో వినిపించింది.

మంత్రులకు సీఎం హెచ్చరిక

సమావేశం చివరలో.. ముఖ్యమంత్రి మంత్రులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని ఆయన స్పష్టంగా సూచించారు. ఈ సీరియస్ హెచ్చరిక మంత్రులపై మరింత ఒత్తిడిని పెంచింది. ముఖ్యమంత్రి నిశిత పర్యవేక్షణలో మంత్రుల పనితీరు ఉందని, ఇకపై ఏ మాత్రం అలసత్వం వహించినా సహించేది లేదనే సంకేతాలను ఈ సమావేశం ద్వారా చంద్రబాబు నాయుడు పంపారు. రాబోయే రోజుల్లో కేంద్ర నిధులు, పథకాల అమలులో మంత్రులు చురుగ్గా వ్యవహరించకపోతే.. వారిపై కఠిన చర్యలు ఉండే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు అధికార వర్గాల్లో నడుస్తోంది.

ALSO READ: Telangana Global Summit-2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ సక్సెస్.. భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు

Related News

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

Big Stories

Advertisement
×