BigTV English
Advertisement

CM Chandrababu: డబ్బులు ఒక్కటే కాదు.. సంతానం కూడ ముఖ్యమే.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: డబ్బులు ఒక్కటే కాదు.. సంతానం కూడ ముఖ్యమే.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: డబ్బులు దండిగా వచ్చాయని, ఆనందకర జీవితం సాగుతుందన్న అభిప్రాయంతో పిల్లలు వద్దనుకుంటే చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలుంటాయంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జ్యూరిక్ లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు సోమవారం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.


చంద్రబాబు మాట్లాడుతూ.. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు డబ్బులు సంపాదించడం పైనే దృష్టి కేంద్రీకరించి, తమ వారసత్వాన్ని కొనసాగించడంలో వెనుకంజ వేయొద్దన్నారు. పిల్లలు వద్దనుకుంటే, మీరు పోగు చేసిన ఆస్తి ఎవరు అనుభవిస్తారంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. జపాన్ దేశం ఇటీవల ఇండియాకు మ్యాన్ పవర్ కావాలని అర్థించే స్థాయికి వచ్చిందని, అటువంటి పరిస్థితి మన ఇండియాకు రావద్దన్నారు.

ఎన్నికల సమయంలో ఎందరో విదేశాల నుండి వచ్చి తెలుగువారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారు. తాను జైలుకు వెళ్లిన సమయంలో విదేశాలలో కూడా తెలుగువారు నిరసనలు తెలిపి తమ అభిమానాన్ని చాటారని , వారందరికీ తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. రాజకీయరంగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకువచ్చామని, యువతను రాజకీయంగా తాము ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పురోగతి నుండి తిరోగమనము వైపు సాగిందని, అందుకే ప్రజలు తమపై నమ్మకంతో భారీ మెజార్టీని అందించి అధికారాన్ని అప్పగించారన్నారు.


తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కు తాను నాడు మైక్రోసాఫ్ట్ తీసుకురావడంతోనే, నేడు మన తెలుగు వారు సత్య నాదేళ్ళ మైక్రోసాఫ్ట్ సీఈఓ గా నిర్వర్తిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. తెలుగు వారందరూ ఎక్కడున్నా, గ్లోబల్ లీడర్స్ కావాలని, అలాగే గ్లోబల్ సిటిజన్స్ గా గుర్తింపు పొందాలని చంద్రబాబు సూచించారు. మిమ్మల్ని ఏపీకి రమ్మని తాను ఆహ్వానించనని, స్వార్థంగా ఆలోచించే విధానం తనది కాదన్నారు సీఎం. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, తయారీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. ఏపీలోని యువత వద్ద నైపుణ్యత ఉందని, వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా విదేశాలలో ఉన్న తెలుగువారు సహకరించాలన్నారు.

Also Read: Nara Lokesh: అంతా భ్రాంతియేనా.. లోకేష్‌‌‌కు డిప్యూటీ సీఎం పదవి హుష్ కాకి..

వైసీపీ హయాంలో ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైన ప్రక్రియ పోలవరం నాశనం, రాజధాని శూన్యంలా పాలన సాగిందంటూ చంద్రబాబు విమర్శించారు. కర్మభూమిని జన్మభూమిని సరి సమానంగా చూడాలని, ఉక్రెయిన్ వార్ జరిగిన సమయంలో విదేశాల్లో ఉన్న తెలుగువారి సహాయంతోటే వైద్య విద్యార్థులను దేశానికి రప్పించగలిగినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానా శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, పలువురు పాల్గొన్నారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×