BigTV English
Advertisement

CM Chandrbabu on Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే

CM Chandrbabu on Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామాపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే

CM Chandrbabu on Vijayasai Reddy:  ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారిగా విజయసాయిరెడ్డి రాజీనామా పై స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు, తన ఎంపీ పదవికి కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారగా, వైసీపీ క్యాడర్ నివ్వెర పోయిందని చెప్పవచ్చు. అయితే ఇదే అంశంపై సీఎం చంద్రబాబు శనివారం మాట్లాడారు.


విజయసాయిరెడ్డి తన రాజీనామా ప్రకటనలో సీఎం చంద్రబాబుకు తనకు రాజకీయంగా మాత్రమే విభేదాలు ఉన్నాయని, వ్యక్తిగతంగా విభేదాలు లేవంటూ పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సైతం చిరకాల స్నేహం ఉన్నట్టు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో కేవలం రాజకీయంగా మాత్రమే విభేధించానని, వ్యక్తిగత వైరాలు లేవన్నారు. ఈ కామెంట్స్ పై సీఎం చంద్రబాబు స్పందించారు.

Also Read: RK Roja: రోజాపై టీడీపీ ఎమ్మేల్యే జబర్దస్త్ పంచులు.. ఏకంగా అలా అనేశారేంటి?


సీఎం మాట్లాడుతూ.. సహజంగా రాజకీయ నేతలకు తామున్న పార్టీపై నమ్మకం లేనప్పుడే ఇంకొక పార్టీకి వెళ్లడం జరుగుతుందన్నారు. కానీ నిన్నటి వరకు వైసీపీలో కొనసాగిన విజయసాయిరెడ్డి, పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకొని పార్టీకి దూరమయ్యారన్నారు. అలాగే ఈ అంశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినదిగా అభివర్ణించిన సీఎం చంద్రబాబు, ఇంతకంటే స్పందించడం మంచిది కాదంటూ మాట్లాడారు. మొత్తం మీద రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని గ్రహించే, విజయ సాయి రెడ్డి రాజీనామా చేసినట్లు చంద్రబాబు చెప్పకనే చెప్పారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×