CM Chandrababu: దేశంలో అత్యంత అనుభవం కలిగిన రాజకీయ నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరు. నాలుగు సార్లు సీఎం అయిన ఘనత ఆయన సొంతం. అయితే సాధారణంగా 50 ఏళ్లు దాటితేనే ఇక అంతా అయిపోయిందని చాలా మంది భావిస్తుంటారు. 60 ఏళ్లకు అడుగుపెట్టేసరికి షుగర్, బీపీ, నడుము – కాళ్లు నొప్పులు చుట్టుముట్టేస్తుంటాయి. అలాంటిది 75 ఏళ్ల వయసులోనూ ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ చంద్రబాబు ఒక యువకుడిలా కష్టపడుతున్నారు. తాజాగా కుప్పం పర్యటన సందర్భంగా చిన్నపిల్లాడిగా మారిపోయి ఎంతో ఉత్సాహంగా సైకిల్ తొక్కి ఆశ్చర్యంలో ముంచెత్తారు.
సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం (Kuppam)లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు ఒకేసారి 5,555 ఈ సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా గిన్నీస్ రికార్డు సృష్టించారు. కుప్పం నియోజకవర్గాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే శివపురం నుంచి ప్రజావేదిక వరకూ దాదాపు 3 కిలోమీటర్ల పాటు చంద్రబాబు ఈ – సైకిల్ తొక్కడం విశేషం. చంద్రబాబు ముందుకు సాగుతుండగా ఆయన వెంట వందలాది మంది సైకిళ్లు, కార్లలో అనుసరించడం గమనార్హం. అయితే చంద్రబాబు సైకిల్ స్పీడ్ ను అందుకునేందుకు ఆయన సెక్యూరిటీ టీమ్ మరింత వేగంగా పరిగెత్తాల్సి రావడాన్ని వీడియోలో చూడవచ్చు.
కుప్పాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5555 ఇ-సైకిళ్ల పంపిణి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అనంతరం ప్రజావేదిక వద్దకు ఇ-సైకిల్ తొక్కుకుంటూ ర్యాలీగా చేరుకున్న ముఖ్యమంత్రి. ప్రజా వేదిక డయాస్ వరకు ఇ-సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన సీఎం. #CBNInKuppam… pic.twitter.com/TEYyFX7LM0
— Telugu Desam Party (@JaiTDP) January 31, 2026
కుప్పం రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు. బెగ్గిపల్లెలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మునెమ్మ అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను, చిన్నతాయమ్మ అనే మహిళకు వితంతు పింఛను, వెంకటరామప్పకు వృద్ధాప్య పింఛను అందించారు. అనంతరం లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫొటోలు దిగారు.
Also Read: Ambati Rambabu: అంబటి బండ బూతులు.. ఏకంగా చంద్రబాబునే, ఫైర్ అవుతోన్న తమ్ముళ్లు