BigTV English

AP Assembly Session : ఓటర్లకు పాదాభివందనం.. 2047 వికసిత్ ఏపీనే లక్ష్యం : సీఎం చంద్రబాబు

AP Assembly Session : ఓటర్లకు పాదాభివందనం.. 2047 వికసిత్ ఏపీనే లక్ష్యం : సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Speech in AP Assembly: ఏపీ అసెంబ్లీలో నిన్న గవర్నర్ ప్రసంగానికి నేడు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీనిపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అర్థరాత్రి 12 గంటల వరకూ ఓపికగా క్యూ లైన్లలో నిలబడి ఓటేసిన ఓటర్లందరికీ పాదాభివందనం చేస్తున్నామన్నారు. 2047 వికసిత ఆంధ్రప్రదేశే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.


తాను జైల్లో ఉన్నప్పుడు తనను కలిసేందుకు వచ్చిన పవన్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దనే మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఎలాంటి కండీషన్ లేకుండా పవన్ తమకు మద్దతిచ్చారని మరోసారి చెప్పారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఏపీ ప్రజల్లో చైతన్యం వచ్చిందనేందుకు నిదర్శనమన్నారు. జూన్ 4న వెల్లడైన ఫలితాలు కొత్త చరిత్ర సృష్టించాయన్నారు. గతంలో తానెప్పుడూ ఇంతపెద్ద విజయాన్ని చూసింది లేదని, ఇది మార్పుకు సంకేతమన్నారు.

గత ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసిందని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అమాయక ప్రజల మెడపై కత్తులు పెట్టి.. భూములను, ఆస్తుల్ని రాయించుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డలకు రక్షణలేకుండా చేశారని దుయ్యబట్టారు. అంతకుముందు టీడీపీ హయాంలో పల్లెల్లో చదువుకుని ఐటీ దిగ్గజాలుగా ఎదిగినవారున్నారని గుర్తు చేశారు.


Also Read : ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..ఇక అమరావతికి మహర్ధశ

నాడు మద్రాసుతో విడిపోయి.. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్న చంద్రబాబు.. ఇప్పుడు పదేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేని దుస్థితి ఏర్పడిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో ఐటీ రంగానికి చాలా ప్రాధాన్యమిచ్చామని, వైసీపీ హయాంలో అది కరువైందన్నారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు కావలసిన నిధులను ఇస్తామని కేంద్రం చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. సమిష్టిగా కృషిచేస్తే ఏపీని అభివృద్ధి చేయడం కష్టం కాదన్నారు.

వైసీపీ తీరుతో ఏపీ అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి.. తీరని నష్టం చేశారన్నారు. ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, అభివృద్ధి కుంటుపడేలా చేశారన్నారు. ఇసుక, మద్యం, మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారని దుయ్యబట్టారు. ఒక్క మైనింగ్ లోనే రూ.20 వేల కోట్లను దోచుకున్నారని, అక్రమంగా సంపాదించిన సొమ్మునంతా ఎన్నికల్లో ఖర్చు చేశారని తెలిపారు.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×