Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి అంటే 29 గ్రామాల సమాహారం మాత్రమే కాదని, జయవాడ గుంటూరులను కలిపి రాజధాని గా చూడాలని అన్నారు. పనులు వేగం పెంచాలన్నారు. రాజధాని పనుల సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా రాజధాని పనులు జరగాలని సీఎం అన్నారు. గతంతో పోల్చితే పనుల్లో వేగం కొంత మేర పెరిగినా.. ఇంకా వేగం పెంచాలన్నారు. ఒక నిర్మాణ సంస్థగా రాజధాని పనులు చేపట్టడం గొప్ప అవకాశమని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.
Also Read: గద్వాల ప్రభుత్వ కళాశాలలో దారుణం.. లెక్చరర్ రాక్షసత్వానికి విద్యార్థి బలి!
ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూదని సీఎం స్పష్టం చేశారు. రాజధానిలో 95 ప్రాజెక్టులకు సంబంధించి రూ.50,999 కోట్ల విలువైన పనులు చేపట్టగా నెలకు కనీసం 7.92 శాతం పనులు జరగాలని సూచించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్లు వంటి అంశాల్లో అన్ని శాఖలు, ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపుపైనా దృష్టిపెట్టాలని సూచించారు. తాను కూడా స్వయంగా ఇకపై రాజధాని పనులను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Also Read: స్కూల్ బాలికల కన్నీటి గాథ.. బిగ్ టీవీ కథనంతో అధికారుల యాక్షన్