E-Paper
Advertisement

AP Free Gas Cylinders: ఈ రోజు నుంచే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. బుకింగ్స్ కొత్త రూల్స్ ఇవే..

AP Free Gas Cylinders: ఈ రోజు నుంచే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. బుకింగ్స్ కొత్త రూల్స్ ఇవే..
Advertisement

సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళంలో ఈ ఉచిత సిలిండర్ల దీపం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలోని గుడిపాలలో రవాణా శాఖ మంత్రి రామ్‌ ప్రసాద్‌ రెడ్డితో ఉచిత సిలిండర్ల పంపిణీ చేసి పథకాన్ని ప్రారంభిస్తారు.

Advertisement

లబ్ధిదారులు ఇప్పటి మాదిరిగానే గ్యాస్‌ సిలిండర్లు నగదును చెల్లించి గ్యాస్ సిలిండర్‌ పొందనున్నారు. సిలిండర్‌ ఇంటికి డెలివరీ అయిన 48 గంటల్లో ప్రత్యక్ష నగదు బదిలీవిధానంలో వ్యక్తిగత బ్యాంకు అకౌంట్​‌కు నగదును జమ చేస్తారు. ప్రతి నాలుగు నెలల్లో ఒక గ్యాస్​ సిలిండర్‌ను ఎప్పుడైనా ఉచితంగా పొందే అవకాశాన్ని ​ ప్రభుత్వం కల్పిస్తోంది.

Also Read: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. జగన్‌పై మంత్రి లోకేష్ ఆగ్రహం

Advertisement

బుకింగ్, డెలివరీ, నగదు జమ తదితర సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబరుతో పాటు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కాల్‌ సెంటర్‌కు, గ్రామ స్థాయిలో సచివాలయాల్లో తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తారని అధికారులు తెలిపారు.ఉచిత సిలిండర్‌ పొందేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. తెల్లరేషన్‌ కార్డు కలిగిన లబ్దిదారులందరికీ ఉచిత సిలిండర్‌ అందజేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో.. ఏ ప్రభుత్వం ఇవ్వని వరం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం.. దీపం 2.0 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిడర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఇది మా చిన్న కుటుంబాలకు ఎంతో సాయం అంటూ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు APలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేగంగా జరుగుతోంది. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటికే 32.84 లక్షల మందికి పింఛన్లు అందచేశారు.

 

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×