BigTV English
Advertisement

Nara lokesh in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. జగన్‌పై మంత్రి లోకేష్ ఆగ్రహం, త్వరలో రెడ్‌బుక్‌..

Nara lokesh in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. జగన్‌పై మంత్రి లోకేష్ ఆగ్రహం, త్వరలో రెడ్‌బుక్‌..

Nara lokesh in Atlanta: మాజీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేష్. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఏపీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు.


ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తితోపాటు ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం ఇచ్చారన్నారు. కానీ మాజీ సీఎం జగన్.. ఆస్తుల విషయంలో తల్లి, చెల్లిని రోడ్డు కీడ్చారంటూ విమర్శలు గుర్పించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా ఆయనలో ఇంకా మార్పు రాలేదన్నారు.

అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ అట్లాంటాలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, జగన్ గురించి మాట్లాడాలంటూ అభిమానులు రిక్వెస్ట్ చేయడంతో నోరు విప్పారాయన.


ఆయన గురించి మాట్లాడటానికి ఏమీ లేదని, ప్రజలే కుర్చీ మడతపెట్టారన్నారు. ఫలితాలు వచ్చినప్పుడు కాస్త భయమేసిందని, ఈ స్థాయిలో వస్తుందని తాము ఊహించలేదన్నారు మంత్రి లోకేష్. సీఎం బాబు అనుకుంటే.. లోపల వేయడానికి రెండు నిముషాలు చాలన్నారు.

ALSO READ:  జంటగా దీపాలు వెలిగించిన దువ్వాడ, మాధురి.. అసలేం చెప్పారంటే?

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆవేదన లేదా? ఎలాంటి తప్పు చేయని వ్యక్తి 52 రోజులు జైలులో ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం కావాల్సింది రివేంజ్ కాదని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే ఆయన లక్ష్యమన్నారు. యువతకు ఉపాధి కల్పించాలన్నారు.

ప్రజలు తమపై బాధ్యత పెట్టారని, వారి ఆశలు వమ్ము చేయమన్నారు. పెట్టుబడులు రప్పించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కచ్చితంగా రెడ్ బుక్‌ని అమలు చేస్తామని చెప్పకనే చెప్పేశారు మంత్రి లోకేష్. ఈ క్రమంలో లెజెండ్‌ మూవీలో బాలకృష్ణ డైలాగ్‌ని గుర్తు చేశారు. తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా ఉంటుందన్నారు.

 

 

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×