E-Paper
Advertisement

Tirumala News: తిరుమలలో అపచారం.. రామ రామ, ఎంత పని చేశారు?

Tirumala News: తిరుమలలో అపచారం.. రామ రామ, ఎంత పని చేశారు?
Advertisement

Tirumala News: తిరుమల కొండలు నిత్యం గోవింద గోవింద అనే నామస్మరణతో మార్మోగుతాయి. వేసే అడుగు.. తీసే అడుగు నిత్యం వెంకటేశ్వరుడు స్మరణలో ఉంటారు. చివరకు చెడు మాటలు ఆడటానికి భక్తులు ఇష్టపడరు. ఏడు కొండలపై కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తి ముసుగులో అన్యమత ప్రచారానికి పాల్పడినవారు కొందరైతే.. అపవిత్రం చేసేవారు మరికొందరు.

తాజాగా తమిళనాడుకి చెందిన కొందరు భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుపతిలో దిగిపోయారు. అక్కడి నుంచి మెట్ల మార్గంలో తిరుమలపైకి నడిచి వెళ్లారు. అయితే వస్తూ వస్తూ ఆ భక్తుల టీమ్.. కోడి గుడ్లు, పలావ్‌తో అక్కడికి చేరుకుంది. రాంభగిచా బస్టాండ్ ఆవరణలో కోడిగుడ్డు, పలావ్ ఆరగించడాన్ని గుర్తించారు కొందరు శ్రీవారి భక్తులు.

Advertisement

ఈ విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, వెంటనే వారు తింటున్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషేధించామని, ఇకపై ఈ విధంగా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయం తెలియగానే టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు.

దీనికి సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలు దేవాలయాలకు వెళ్లేటప్పుడు నియమాలు, నిష్టతో వెళ్తారు. ఏకంగా కోడి గుడ్లు, పలావ్‌తో వచ్చారంటే.. కావాలనే ఎవరో చేసి ఉంటారనే వాదనలు తిరుమల కొండపై లేకపోలేదు. తిరుమల అపవిత్రను దెబ్బతీసేందుకు ఇలా చేసి ఉండవచ్చని అంటున్నారు. ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

ALSO READ: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, దేనికి?

 

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×