E-Paper
Advertisement

Target Dwarampudi: ద్వారంపూడి చిక్కినట్టేనా? కాకినాడలో షాపుల కూల్చివేత

Target Dwarampudi: ద్వారంపూడి చిక్కినట్టేనా? కాకినాడలో షాపుల కూల్చివేత
Advertisement

Target Dwarampudi: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చిక్కినట్టేనా? ఈ నేత చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోందా? కూటమి సర్కార్ నెక్ట్స్ టార్గెట్ ద్వారంపూడేనా? ఆయన బినామీలపై దృష్టి పెట్టిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి బలంగా వినిపించిన గొంతుకది. ద్వారంపూడి- పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఆ తర్వాత వైసీపీ ఓడిపోవడం, కూటమి అధికారంలోకి రావడంతో జరిగిపోయింది. ఇక అసలు విషయానికొద్దాం.

Advertisement

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బినామీ వ్యాపారాలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. కూటమి అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగేశారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని ప్రభుత్వం సీజ్ చేసింది. దీంతో ద్వారంపూడి ఆదాయానికి బ్రేక్ పడింది.

ద్వారంపూడి ఎమ్మెల్యేగా సమయంలో కాకినాడ టౌన్‌లో అక్రమ కట్టడాలు వెలిశాయి. వాటిపై అధికారులకు ఫిర్యాదులు అందడంతో సోమవారం ఉదయం రంగంలోకి దిగేశారు. ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

Advertisement

ALSO READ: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ

సంతచెరువు సెంటర్‌లో అక్రమంగా నిర్మించిన షాపుల సముదాయాన్ని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ద్వారంపూడి అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

నిర్మాణాలకు అనుమతులు లేవని, అందుకే కూల్చివేస్తున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పారు. సంవత్సరాలుగా తాము ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నామని, ఇప్పుడు అక్రమ నిర్మాణాలని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో ద్వారంపూడి మద్దతుదారులు-అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

చివరకు పోలీసుల సహాయంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. కాకినాడ టౌన్‌లో ఈ తరహా అక్రమ నిర్మాణాలు చాలానే ఉంటాయని అంటున్నారు స్థానికులు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టౌన్‌లో చిన్న స్థలం కనిపించినా కబ్జాకు గురైందని అంటున్నారు. మిగతా కబ్జాలపై అధికారులు దృష్టి సారించవచ్చని అంటున్నారు.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×