E-Paper
Advertisement

Fire Accident: SSC కెమికల్ ఫ్యాక్టరీలో.. భారీ అగ్ని ప్రమాదం

Fire Accident: SSC కెమికల్ ఫ్యాక్టరీలో.. భారీ అగ్ని ప్రమాదం
Advertisement

Fire Mishap SSC Chemical Factory in Anakapalli district: అనకాపల్లి జిల్లా‌లో భారీ పేలుడు సంభవించింది. ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. కాగా, సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువ ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నది.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది.గ్రామాల్లో చుట్టూ పొగ అలుముకోవడంతో.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరి ప్రమాదంపై స్పందించారు హోం మంత్రి అనిత. అనకాపల్లి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు.ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ లోపలకి, బయటకి ఏ ఒక్కరిని కూడా రాకపోకలు జరగకుండా అక్కడి మేనేజ్మెంట్, సెక్యూరిటీ చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే రియాక్టర్ పేలిన సమయంలో ఏవైనా కెమికల్స్ కూడా ఆ ప్రాంతం అంతా స్ప్రెడ్ అయితే దాని ద్వారా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవ్వరిని లోపలికి వెళ్లనివ్వకుండా గేట్లు వేశారు.

Advertisement

Also Read: దమ్ముంటే ఆ లెక్కలు బయటపెట్టు.. చంద్రబాబుకు పేర్ని నాని సవాల్

ఈ ప్రమాదానికి సంబంధించి గల కారణాలైతే తెలియాల్సి ఉంది. లంచ్ సమయం కావడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రమాదాలు తరుచు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలు జరిగినా కూడా వాటిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన ఫ్యాక్టరీకి సంబంధించి డిపార్ట్మెంట్ నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరించడం వల్లన ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని విమర్శలు కూడా ఉన్నాయి. కేవలం ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తారు తప్ప మిగిలిన రోజుల్లో పట్టించుకోలని అక్కడున్న స్థానికులు చెబుతున్నారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×