E-Paper
Advertisement

Free Sand Effect: ఫ్రీ ఎఫెక్ట్.. అక్ర‌మ ఇసుక కోసం వెళ్లి న‌లుగురు గ‌ల్లంతు.!

Free Sand Effect: ఫ్రీ ఎఫెక్ట్.. అక్ర‌మ ఇసుక కోసం వెళ్లి న‌లుగురు గ‌ల్లంతు.!
Advertisement

ఏపీలోని అల్లూరి జిల్లా రంప‌చోడ‌వ‌రంలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌భుత్వం రాష్ట్రంలో త‌మ‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ వాగులు, వంక‌ల‌లో ఉచితంగా ఇసుక తీసుకు వెళ్ల‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని చాలా వాగుల్లో అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయి. లిమిట్ కు మించి ఇసుక‌ను తోడేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏలేరు కాలువ‌లో ఇసుక త‌వ్వేందుకు వెళ్లిన న‌లుగురు వ్య‌క్తులు గ‌ల్లంతు అయ్యారు. ఈ ఘ‌ట‌న అడ్డతీగ‌ల మండలం బొంగ‌రాల‌పాడు గ్రామ సమీపంలోని ఏలేరు కాలువలో చోటు చేసుకుంది.

Also Read: తండ్రిని ప‌ట్టించుకోని కొడుకు.. రాసిచ్చిన ఆస్తిని తీసుకుని షాక్ ఇచ్చిన తండ్రి!

Advertisement

గ‌ల్లంతు అయిన న‌లుగురు ఏలేశ్వ‌రం మండ‌లం తూర్పు ల‌క్ష్మీపురం గ్రామానికి చెందిన‌వారిలో పోలీసులు గుర్తించారు. గ‌ల్లంతైన వారి కోసం అడ్డ‌తీగ‌ల పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి ఘ‌టన‌లు పునారావృతం కాకుండా చూసుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఉచిత ఇసుక మంచిదే అయిన‌ప్ప‌టికీ అక్ర‌మార్కులు ఇసుకనంతా తోడేయ‌డం వ‌ల్ల గుంట‌లు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. వీటిలో సామాన్యులు సైతం గ‌ల్లంత‌య్యే ప్ర‌మాదం ఉంది. కాబ‌ట్టి ప్ర‌భుత్వం ఇసుక త‌వ్వ‌కాల‌పై నియంత్ర‌ణ పెట్టాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Related News

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×