E-Paper
Advertisement

Nagarjuna University: సాంబార్ లో కప్ప.. నాగార్జున యూనివర్సిటీ ఘటనపై లోకేష్ సీరియస్

Nagarjuna University: సాంబార్ లో కప్ప.. నాగార్జున యూనివర్సిటీ ఘటనపై లోకేష్ సీరియస్
Advertisement

Nagarjuna University: సాంబార్ లో కప్ప. ప్రెజెంట్ ఏపీ హాస్టల్ విద్యార్ధుల్లో ఇదే హాట్ టాపిక్. అయినా సాంబార్లో కప్ప పడితే.. ఆ తిండి ఎవరైనా తినగలరా? అన్న చర్చ విద్యార్ధిలోకంలో జోరుగా సాగుతోంది.

ఆచార్య నాగార్జున వర్సిటీ లేడీస్ హాస్టల్లో జరిగిన ఈ ఘటన ద్వారా ఒక్కసారిగా క్యాంపస్ లో కాక చెలరేగింది. అంతే కాదు విద్యార్థినులు రాత్రని కూడా చూడకుండా హాస్టల్ బయట నిరసన వ్యక్తం చేయడంతో.. ఈ వార్త దావానంలా వ్యాపించింది.

Advertisement

గతంలో కూడా అంతే జెర్రి వచ్చిందనీ.. ఈ తిండి తినలేక పోతున్నామని.. ఎంత మొత్తుకుంటున్న ఎవరికీ పట్టడం లేదనీ. ఎన్ని కంప్లయింట్లు చేసినా ఉపయోగం ఉండటంలేదని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారీ విద్యార్ధినులు.

ANU విద్యార్థినుల ఆందోళన పై ఏపీ విద్యా మంత్రి లోకేష్ రియాక్టయ్యారు. స్టూండెంట్స్ కంప్లయింట్ చేసినా పట్టించుకోని వార్డెన్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు. మెస్ కాంట్రాక్టర్ పై కూడా విచారణ చేపట్టాలని ఆర్డర్ పాస్ చేశారు.

Advertisement

మంత్రి లోకేష్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. వర్సిటీలో ప్రత్యేక తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు.. ఆర్డీవో సైతం తనిఖీ చేశారు. ఉదయం సమయంలో విద్యార్ధులకు అందిస్తున్న అల్పాహారాన్ని పరిశీలించిన అధికారులు.. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి.. మంచినీటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చెక్ చేశారు. ఫ్రిడ్జిలో నలుగు ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. దీనిపై ఆరా తీశారు. లేడీస్ హాస్టల్లో విద్యార్ధినులకు అందించే ఆహారం ఎలా ఉందో ఒక నివేదికను అందించనున్నారు అధికారులు. ఈ రిపోర్ట్ ఆధారంగా వార్డెన్, మెస్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకునే అవకాశముంది.

Also Read:  కలిసిరాని నేతలు.. రంగంలోకి జగన్

మరోవైపు వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు మౌలిక సౌకర్యాల విషయంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కల్పిస్తున్న వసతులను పరిశీలించేందుకు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలతో పాటు రాత్రి బసలు కూడా చేస్తున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×