E-Paper
Advertisement

Vijayawada : విజయవాడలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..

Vijayawada : విజయవాడలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..
Advertisement

Vijayawada : విజయవాడలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం బాధితురాలు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. నగరంలోని బెంజ్ సర్కిల్‌ వద్ద కూలి పనులు చేసుకుని జీవించే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్‌ కాంప్లెక్స్‌లో పని చేసే వ్యక్తి ఈ నెల 17న కానూరు సనత్‌నగర్‌లోని ఓ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ అతడితోపాటు మరో ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో మూడు రోజులపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తీవ్ర అస్వస్థత గురైంది. ఆమె సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది.

Advertisement

ఆసుపత్రి వర్గాల సమాచారం ఇవ్వడంతో పెనమలూరు పోలీసులు వచ్చి బాధితురాలితో మాట్లాడారు. సోమవారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేరాల్లో ఎక్కువగా మహిళలే బాధితులుగా ఉంటున్నారు. ఏడాది క్రితం రేపల్లె రైల్వేస్టేషన్ లోనే ఓ మహిళ గ్యాంగ్ రేప్ కు గురయ్యారు. భర్త కళ్లేదుటే ఈ దారుణం జరిగింది. భర్తపై దాడి చేసి నిందితులు దారుణానికి పాల్పడ్డారు. అలాగే కొంతకాలం క్రితం త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట విజయవాడ సమీపంలో ఓ బ్రిడ్జి కిందకు సరదాగా విహారానికి వెళ్లగా… దుండగులు దాడి చేశారు. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రెండు ఘటనలు తీవ్ర సంచలనం రేపాయి.

Advertisement

ఇలాంటి ఘటనలు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో తరచూ జరుగుతున్నాయి. గంజాయి బ్యాచ్ లు ఈ దారుణాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలున్నాయి. అలాగే బ్లేడ్ బ్యాచ్ లు దోపిడిలకు తెగబడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలో రేప్ లు, దొంగతనాలు ఎక్కువగా జరగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం, పోలీసులు తీరుపైనా ప్రజలు మండిపడుతున్నారు. నేరాల నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడంలేదని విమర్శిస్తున్నారు.

Tags

Related News

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

Big Stories

Advertisement
×