E-Paper
Advertisement

Home minister anitha angry on jagan: జగన్‌పై హోంమంత్రి ఆగ్రహం, ఆ.. దమ్ము లేదా?

Home minister anitha angry on jagan: జగన్‌పై హోంమంత్రి ఆగ్రహం, ఆ.. దమ్ము లేదా?
Advertisement

Home minister anitha angry on jagan: వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు హోంమంత్రి అనిత. గత ప్రభుత్వం చేసిన వ్యవహారాలను అసెంబ్లీ వేదికగా తూర్పారబట్టారామె. సిగ్గు లేకుండా ఢిల్లీ వీధుల్లో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రెడ్ బుక్ గుర్తొస్తే ఆయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సామెతను హోంమంత్రి గుర్తు చేశారు.

శాంతి భద్రతల వ్యవహారంపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హోం మంత్రి అనిత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని గుర్తు చేశారు. అందులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు మృతి చెందారన్నారు.

Advertisement

సోషల్‌మీడియా వేదికగా వైసీపీ నేతలు.. టీడీపీ నేతలపై దుమ్మెత్తిపోస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా దాడులు సైతం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో జగన్ అసత్యాలు చెబుతున్నారని, అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ఆ జాబితా ఇచ్చే దమ్ము జగన్‌కు ఉందా అంటూ ప్రశ్నించారు.

ALSO READ: చంద్రబాబు సర్కార్ నిర్ణయం, చిక్కుల్లో జగన్, రేపోమాపో ఈడీ..

Advertisement

హత్యకు గురైనవారి పేర్లు నేషనల్ మీడియాతో అడిగితే జగన్ చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారామె. అసెంబ్లీకి వచ్చి హత్యకు గురైనవారి జాబితా ఇచ్చే దమ్ము జగన్‍కు ఉందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే జగన్ ఆలోచనగా చెప్పుకొచ్చారు. హత్యలకు సంబంధించిన వివరాలు ఇస్తే, తగిన విచారణ చేయిస్తామన్నారు. తప్పుడు వివరాలు ఇచ్చినట్టు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

వైసీపీ పాలనలో గంజాయి రాష్ట్రమంతటా విస్తరించిందన్నారు హోంమంత్రి అనిత. స్కూల్ పిల్లల బ్యాగుల్లో కూడా గంజాయి లభించేలా వ్యాపారం జరిగిందన్నారు. గంజాయి తాగి విచక్షణ లేకుండా, నేరాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. గంజాయి నియంత్రణ అనేది మా ప్రభుత్వ మొదటి బాధ్యత వివరించారు.

 

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×