E-Paper
Advertisement

AP : సీఐడీకి చుక్కలు చూపిస్తున్న ఆంజనేయులు.. మామూలోడు కాదుగా..

AP : సీఐడీకి చుక్కలు చూపిస్తున్న ఆంజనేయులు.. మామూలోడు కాదుగా..
Advertisement

AP : ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పట్లేదట. తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. ఇవే రొటీన్ డైలాగులట. గంటల తరబడి విసిగిస్తున్నాడట. ఏది అడిగినా.. ఏమో అంటున్నాడట. అన్నం తినమంటే తినట్లేదట. నాకు అవసరం లేదంటూ మొండి చేస్తున్నాడట. ఐపీఎస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు మూడు రోజుల పాటు కస్టడీలో సీఐడీ అధికారులకు చుక్కలు చూపించారని తెలుస్తోంది. సోమవారం 6 గంటల పాటు.. 80కి పైగా ప్రశ్నలు అడిగితే.. దేనికీ సరైన సమాధానం చెప్పలేదని అంటున్నారు. మంగళవారం కూడా అదే ధోరణి కంటిన్యూ చేశారని సమాచారం.

3 రోజులు మమ..!

Advertisement

ముంబై నటి జెత్వానీ కేసులో అరెస్ట్ అయిన PSR ఆంజనేయులును మూడు రోజుల పాటు ప్రశ్నించింది CID. అయితే విచారనకు ఆయన ఏమాత్రం సహకరించలేదని అంటున్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు అధికారులు చెబుతున్నారు. కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పరిధిలో లేదని అధికారులకే ఎదురు ప్రశ్నలు వేశారట. పేరుకు మూడు రోజుల విచారణ జరిగినా.. పీఎస్‌ఆర్ నుంచి పెద్దగా ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారని తెలుస్తోంది. మరోసారి కస్టడీకి కోరాలని సీఐడీ ఆలోచన చేస్తోంది.

PSR vs CID

Advertisement

అసలే సీనియర్ ఐపీఎస్. చట్టంలోని లూప్‌హోల్స్ అన్నీ తెలిసిన పర్సన్. అందుకే విచారణకు సహకరించకుండా ఇబ్బందిపెడుతున్నారని.. ఆయన్నుంచి నిజాలు రాబట్టడం కష్టంగా మారిందని అంటున్నారు. తనకేమీ కాదనే ధీమాలో పీఎస్ఆర్‌ ఉన్నారట. అయితే, ఆధారాలు పక్కాగా ఉండటంతో.. ఈ కేసు నుంచి ఆయన బయటపడటం కూడా అంత ఈజీ కాదని సీఐడీ అధికారులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు?

మరోవైపు.. ఆంజనేయులుపై మరో కేసు నమోదయింది. వైసీపీ హయాంలో ఐపీఎస్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్నారు. ఆ సమయంలో గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. రహస్యంగా ఉంచిన ఈ కేసు విచారణ బాధ్యతలను ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్లు తెలిసింది. దీనిపై ప్రత్యేక బృందాలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత కేసును ఏసీబీకి బదిలీ చేసే అవకాశం ఉంది. పీఎస్‌ఆర్‌కు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు లభించాయని.. పకడ్బందీగా కేసు ఫైల్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం. అదే జరిగితే.. ఆంజనేయులు ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనని అంటున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×