E-Paper
Advertisement

Visakha IT Hubs: IT కి అడ్డా @ విశాఖ 150కి పైగా కంపెనీలు.. సర్కార్ ఎంత భూమి ఇచ్చిందంటే.?

Visakha IT Hubs: IT కి అడ్డా @ విశాఖ 150కి పైగా కంపెనీలు.. సర్కార్ ఎంత భూమి ఇచ్చిందంటే.?
Advertisement

విశాఖలో ఇప్పటికే ఇన్‌ఫోసిస్, టెక్ మహింద్రా, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి 150 బడా కంపెనీలు రాబోతున్నాయి. దీంతో చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏపీఐసీసీ నిర్వహణలో భూములు కేటాయించింది.

Advertisement

మరో ఆరు నెలల్లో 15 కంపెనీలు విశాఖలో ఏర్పడే అవకాశం ఉంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్, క్లౌడ్ డేటా సెంటర్‌కు మధురవాడ సమీపంలో 80 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. గూగుల్ డేటా సెంటర్‌తో పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దీంతోపాటు ఏఐ,క్లౌడ్ సర్టిఫికేషన్ మెంటార్ షిప్, కొత్త కంపెనీలు ఏర్పాటు చేసే యువతకు శిక్షణ ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది.

విశాఖకు ఐటీ కంపెనీలు రావడంపై యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి నగరాలకు వెళ్లకుండా.. సొంత ప్లేస్‌లో ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు. పని ఒత్తిడి తగ్గించుకునేందుకు కూడా విశాఖలోని ప్రదేశాలు ఆహ్లాదాన్నిస్తాయని తెలిపారు.

Advertisement

నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు కలెక్టర్ హరేందిరా ప్రసాద్. రానున్న మూడేళ్లలో విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందన్నారు. ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ఏపీలో క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తే.. విశాఖ దశ మారుతుంది అంటున్నారు సింబయాసిస్ ఐటీ కంపెనీ సీఈఓ నరేష్. ప్రభుత్వం ఐటీ పాలసీ తీసుకొచ్చి ముందు చూపుతో వ్యవహరించిందన్నారు.

Also Read: జగన్‌కి మళ్లీ షాక్.. 113 మందికి నోటీసులు

విశాఖ.. హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో పాటు మౌలిక వసతుల రూపకల్పన కూడా చేస్తుంది. ఇదేవిధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే రానున్న ఐదేళ్లలో ఎన్నో ఐటీ పరిశ్రమలు విశాఖలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×