E-Paper
Advertisement

Jagan: మహా అయితే నాలుగు కేసులు పెడుతారు.. అంతే తప్ప అంతకుమించి ఏం చేయలేరు: జగన్

Jagan: మహా అయితే నాలుగు కేసులు పెడుతారు.. అంతే తప్ప అంతకుమించి ఏం చేయలేరు: జగన్

Jagan Mohan Reddy Comments: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఎవరెన్ని కూట్రలు చేసినా వైఎస్సీర్ సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.

‘ఇటీవల జరిగిన పరిస్థితుల గురించి మీకు తెలిసిందే. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. 40 శాతం ప్రజలు మనవైపే ఉన్నారు.. ఈ విషయాన్ని మనం మరిచిపోవొద్దు. మన ప్రభుత్వ హయంలో జరిగిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తుంది. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన హనీ మూన్ నడుస్తోంది. అందువల్ల కొంత సమయం వారికి ఇద్దాం. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి. ఆ తరువాత గట్టిగా పోరాటం చేద్దాం.

2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు గడిచిపోయినట్టే.. 2024 నుంచి 2029 వరకు కూడా ఈ ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి. మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సినిమాలో ఫస్టాఫ్ మాత్రమే అయిపోయింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏ విధంగానైతే పైకి లేచామో అనేది మీకందరికీ తెలిసిందే. ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటింటికీ మనం చేసిన మంచి బ్రతికే ఉంది.. ఉంటది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అనేది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతది. ఆ సమయం వారికి ఇవ్వాలి. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ల పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్లీ మనం పైకి లేస్తాం. ఈ విషయాన్ని మనమంతా గుర్తించుకోవాలి

Also Read: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఏ ఫైల్‌పై పెట్టారంటే..?

అసెంబ్లీలో మన సంఖ్యా బలం పెద్దగా లేనందున, ఆ సభలో గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవొచ్చు.. వచ్చినా మన గొంతు విప్పనివ్వకపోవొచ్చు. కానీ, మనకు మండలిలో బలం చాలా ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవరూ ఏం చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టగలుగుతారు.. అంతే తప్ప అంతకుమించి ఏం చేయలేరు. చంద్రబాబు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. ఇందుకు సంబంధించి గతంలో మనం చూశాము’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×