BigTV English
Advertisement

Jagan to attend assembly session: మనసు మార్చుకున్న జగన్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు!

Jagan to attend assembly session: మనసు మార్చుకున్న జగన్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు!

Jagan to attend assembly session: వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మనసు మార్చుకున్నారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారా? ఏపీ నుంచి బెంగుళూరుకు మకాం మార్చాలని ఆయన నిర్ణయం తీసుకున్నారా? పదేపదే బెంగుళూరు ఎందుకు వెళ్లాల్సి‌ వస్తోంది? ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కాదు? మరి బెంగుళూరు ఎందుకు వెళ్లినట్టు? రాజకీయ వ్యవహారాలా? లేక బిజినెస్ పనులా? వీటిపైనే వైసీపీ నేతలు చర్చించుకోవడం మొదలైంది.


ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వచ్చే సోమవారం (22న) నుంచి ప్రారంభంకానున్నాయి. కేవలం ఐదు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది చంద్రబాబు సర్కార్. నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. నేతలు, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ముందుగా విషయాన్ని బయటపెట్టారని అంటున్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనను లేవనెత్తాలని భావిస్తున్నారట జగన్. అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారన్నది నేతల మాట. జగన్‌తోపాటు మిగతా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా జగన్ చర్చల్లో పాల్గొంటారు. మరి ఆయనకు తగినంత సమయం అధికార పార్టీ ఇస్తుందా? అన్నదే అసలు పాయింట్. లేదంటే తన నియోజకవర్గం సమస్యలను ఆయన ప్రస్తావించే అవకాశముంది.


అసెంబ్లీలో జగన్ వ్యూహం ఎలా ఉండబోతోందనే అందరిలోనూ ఆసక్తిగా మారింది. ఇన్నాళ్లు మాదిరిగా ఆవేశంగా మాట్లాడే ఛాన్స్ జగన్‌‌కు లేదు. కౌంటర్ ఇచ్చేందుకు సీనియర్ నేతలు ఉంటారు. మరోవైపు జగన్ అసెంబ్లీకి రావడం డౌటేనని అంటున్నారు. సమావేశాలకు తక్కువ సమయం ఉండడంతో కష్టమేనని అంటున్నారు. ఒకవేళ అసెంబ్లీకి వచ్చినా సమావేశాలకు హాజరుకారని అంటున్నారు. సమావేశాలు తర్వాత మళ్లీ బెంగుళూరు వెళ్లిపోవాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.

ALSO READ: ఏపీ సమావేశాల ముందు.. అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్న

సోమవారం బెంగుళూరుకి వెళ్లిన జగన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రాత్రి వేళ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. జగన్ రాకను తెలుసుకున్న ఆయన అభిమానులు కనిపించడంతో వెంటనే కారు ఆపి వాళ్లతో మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పగటి వేళ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి యలహంక ప్యాలెస్‌లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×