E-Paper
Advertisement

Janasena finalized Seats: పెండింగ్ సీట్లకు ఖరారు.. అభ్యర్థులపై జనసేన ప్రకటన..!

Janasena finalized Seats: పెండింగ్ సీట్లకు ఖరారు.. అభ్యర్థులపై జనసేన ప్రకటన..!
Advertisement

janasena finalizes pending candidates vanigadda and pakakonda constituency

Pawan Kalyan finalized Avanigadda and Palakonda Seats: ఏపీలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినట్టే! అభ్యర్థులను ఒకేసారి ప్రకటించింది అధికార వైసీపీ. ఇక టీడీపీ నాలుగైదు విడతలుగా వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ కూడా మంగళవారం దాదాపు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇక పెండింగ్‌‌ లో జనసేన, బీజేపీలు మాత్రమే ఉన్నాయి.

Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్ని కోణాల్లో పరిశీలించి పెండింగ్ లో ఉన్న ఇద్దరు అభ్యర్థులను దాదాపు ఫైనల్ చేసినట్టు సమాచారం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. వారం రోజులపాటు అన్నికోణాల్లో పరిశీలించిన పవన్‌ కల్యాణ్.. గెలిచే అభ్యర్థులను వడపోసి మరీ ఎంపిక చేశారు.

టీడీపీ నేతలైన బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ రీసెంట్ గా జనసేనలో చేరారు. దీంతో దాదాపు అభ్యర్థులను ఎంపిక పూర్తి అయినట్టే. ఇక ప్రచారంలోకి దిగడమే మిగిలివుంది. ఇదిలా వుండగా ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరు అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ జనసేన ఇన్ ఛార్జ్ రూపానంద్ రెడ్డికి సన్నిహితుడైన అరవ శ్రీధర్ ను బరిలోకి దింపే అవకాశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ బుధవారం అభ్యర్థి మార్పుపై కొలిక్కి రావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Also Read: EC Big Shock To Janasena : గ్లాస్ పగిలింది.. జనసేనకు ఈసీ బిగ్ షాక్!

ఇక జనసేన అధినేత ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ వారంలోనే బీజేపీ కూడా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నమాట. అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నంకానున్నారు. ఇక ముఖ్యనేతల సభలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

టీడీపీ ఒక చోట, జనసేన మరోవైపు, బీజేపీ ఇంకోవైపు సభలను నిర్వహించనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా రెండు రోజుల్లో విడుదలకానుంది. ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి అభ్యర్థులు తమతమ నియోజకవర్గంలో నిమగ్నమై ఉండాలన్నది హైకమాండ్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారంలోకి దిగిన వెంటనే పార్టీల మధ్య మాటల వార్ కొనసాగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×